Andhra Pradesh: వైసీపీతో కాంగ్రెస్ పొత్తు ప్రతిపాదన.. జగన్ గ్రీన్సిగ్నల్ ఇస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది.
మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్తో పొత్తు విషయాన్ని వైసీపీ నేతల దగ్గర ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే పలుమార్లు వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డితో పీకే చర్చలు జరిపారట. మరి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ అధినేత జగన్ అంగీకరిస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలతో విభేదించి బయటకు వచ్చిన జగన్ తనకంటూ ఓ పార్టీ పెట్టుకున్నారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఒప్పుకోరని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రశాంత్ కిషోర్ సూచనతో కాంగ్రెస్ పొత్తుకు సై అంటారా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై పలువురు మంత్రులు, మాజీ మంత్రులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
వైసీపీ నాయకత్వంలో మాట్లాడకుండానే ప్రశాంత్ కిషోర్ ఈ ప్రతిపాదన చేసి ఉంటారని వైసీపీ నేతలు భావిస్తున్నారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఓకే అన్నాకే జగన్తో మాట్లాడవచ్చని పీకే అనుకున్నారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీకే ఏపీలో వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పొత్తుపై వైసీపీ నాయకత్వాన్ని ఒప్పించవచ్చని భావించి ఉంటారని కొందరు.. గత రెండు ఎన్నికల్లో రాష్ట్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోమని పీకే ఎందుకు చెప్పి ఉంటారని మరికొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాంగ్రెస్లో చేరికపై ప్రశాంత్ కిషోర్ ఈరోజు సోనియాగాంధీతో సమావేశం ముగిసిన అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!