TDP: ఒంగోలుపై పట్టు సాధించేందుకు టీడీపీ కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒంగోలు తెలుగుదేశానికి ఎంతకీ కొరుకుడుపడని కొయ్యగా తయారైంది. ఆ జిల్లాలో బలంగా ఉన్నామని చెప్పుకుంటున్న పార్లమెంట్ సీటుతో పాటు, మరో అసెంబ్లీ సెగ్మెంట్ కు కూడా ఇంచార్జ్ దొరకడం లేదు. అభ్యర్థుల కసరత్తు, రాజకీయ వ్యూహాలు ఎన్ని ఉన్నా.. ఆ పార్టీకి అక్కడ పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదని టాక్.. చివరినిమిషంలో సీటు దక్కగా వచ్చే వలస నేతల కోసమే ఆ పార్టీ ఎదురుచూస్తోందని అధికార పార్టీ విమర్శిస్తోంది.
Wine Bottle : వైన్ బాటిల్ ను ఓపెన్ చేశాక ఎన్ని రోజులు తాగొచ్చో తెలుసా?
Also Read
- Hidden Treasure : అడవిలో అర్థరాత్రి తవ్వకాలు.. గుప్తనిధుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్లే వేట.?
- Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
ఒంగోలు ఎంపీ స్థానాన్ని టీడీపీ ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఆ సీటుపై వైసీపీ జెండా పాతింది. అలాంటి చోట టీడీపీ గెలుపుపై ఆపసోపాలు పడుతుంది. 2014లో టీడీపీ నుంచి పోటీచేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఓడిపోయారు. దాంతో ఆయన ఎమ్మెల్సీగా కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత ఎన్నికల సమయానికి మాగుంట వైసీపీలో చేరారు. దాంతో సిద్ధారాఘవ రావు బరిలో నిలబడాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో సిద్ధా ఓడిపోయారు. అంతటితో ఎపిసోడ్ అయిపోలేదు. కొంతకాలం తర్వాత సిద్ధా కూడా వైసీపీ గూటికి చేరారు.
Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్
అలా అప్పటినుంచి టీడీపీకి ఒంగోలులో ఇంఛార్జ్ లేకుండానే నెట్టుకు వస్తున్నారు. రెండుసార్లు మాత్రమే ఒంగోలు పార్లమెంట్ నుంచి టీడీపీ గెలిచినా.. అక్కడ బలోపేతం చేసుకునేందుకు ఇంతవరకు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదని విమర్శలు సొంతపార్టీలోనే ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నూకసాని బాలాజీని పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు దర్శి నియోజకవర్గంలో కూడా రెండేళ్లుగా ఇంచార్జ్ లేకపోవడం పార్టీ మైనస్ గా చెబుతున్నారు. కాగా.. పొత్తులో భాగంగా జనసేనకు దర్శి టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా.. టీడీపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆశావాహులు ముందుకు వస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాల్లో పార్టీ స్టాండ్ ఏంటీ.. అధినేత ఆలోచనలు ఎలా ఉన్నాయి. అక్కడ ఏం జరగబోతుందో చూడాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే…
తాజావార్తలు
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
-
Trump-Iran: పశ్చిమాసియా రౌడీ చనిపోయాడు.. ఇరాన్పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
-
Sunil Gavaskar: విమర్శించే వారే మళ్లీ బీసీసీఐ దగ్గరకు వస్తారు.. అంతా డబ్బు మహిమ: సునీల్ గావస్కర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!