Driver Saved Lives: గుండెపోటు వచ్చినా కేర్ చేయలే.. 60 మందికి పైగా ప్రాణాలు కాపాడిన డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Driver Saved Lives: ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో మంగళవారం నాడు 60 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు ఓ బస్సు డ్రైవర్. ఆ వ్యక్తి బస్సును నడుపుతున్నప్పుడు అతనికి గుండెపోటు రాగా.. ఆ నొప్పితో కూడా బస్సును ఆపి బస్సులోని ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. కానీ బస్సును ఆపిన అనంతరమే అతని గుండె ఆగిపోయింది. ఆ బస్సులోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ డ్రైవర్ బస్సును ఆపి ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పటాపూర్ చక్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: Metro Train: మెట్రో ట్రైన్ లో పొట్టు పొట్టు కొట్టుకున్న ప్రయాణికులు
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
పశ్చిమ బెంగాల్ నుంటి పర్యాటకులతో బస్సు జిల్లాలోని పంచలింగేశ్వరాలయం వైపు వెళుతుండగా డ్రైవర్కు గుండెపోటు వచ్చిందని పోలీసులు తెలిపారు. నొప్పిగా అనిపించిన వెంటనే డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి స్పృహ కోల్పోయాడు. భయాందోళనకు గురైన ప్రయాణికులు స్థానికులను పిలిచారు, వారు డ్రైవర్ను షేక్ అక్తర్గా గుర్తించి సమీపంలోని నీలగిరి సబ్డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు.
డ్రైవర్ అకస్మాత్తుగా అస్వస్థతకు గురై బస్సును నిలిపివేసినట్లు ప్రయాణీకుల్లో ఒకరైన అమిత్ దాస్ తెలిపారు. రోడ్డుకు ఒకవైపు వాహనం ఆగిన వెంటనే స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ మనోగతాన్ని ప్రయాణికులు, స్థానికులు కొనియాడారు. ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన ఆయనను దేవుడిలా కొనియాడుతున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?