Balineni Srinivasa Reddy: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.. దీనిపై పాలక, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి విషయంలో జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని టీటీడీ మాజీ ఛైర్మన్ స్పష్టంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఆ కల్తీ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు. లడ్డూ అంశంపై పదే పదే చర్చించడం వల్ల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని సూచించారు. తప్పు చేసిన వారు ఉంటే వారిని వెంకటేశ్వర స్వామి, సీబీఐ చూసుకుంటారని వ్యాఖ్యానించారు. మరోవైపు, అలాగే జిల్లాలో జనసేన పార్టీ బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేది పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయమని తెలిపారు జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.
Read Also: Ghooskhor Pandat : మనోజ్ బాజ్పేయీ ‘ఘూస్ఖోర్ పండత్’ మూవీ టైటిల్పై సుప్రీంకోర్టు సీరియస్..