ఏపీ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన తల్లీకూతుళ్ళ దారుణ హత్యకేసు. టంగుటూరు తల్లీకూతుళ్ళ డబుల్ మర్డర్ కేసును ఛేదించారు పోలీసులు.హత్యకేసులో నిందితులను గుర్తించారు పోలీసులు. డిసెంబర్ 3న టంగుటూరులో దారుణ హత్యకు గురయ్యారు తల్లీకూతుళ్లు శ్రీదేవి, శ్రీలేఖ.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు పోలీసులు. నిందితులు కందుకూరుకు చెందిన పాత నేరస్తులు శివకోటయ్య, కిషోర్ గా గుర్తించారు పోలీసులు. నిందితులు హత్యకు నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్లు గుర్తించారు. ఒంటరిగా ఉన్న తల్లీకూతుళ్ళను హత్య చేసి బంగారు నగలు ఎత్తుకెళ్ళారు నిందితులు. హత్యకు ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తులు సంబంధం ఉన్నట్లు భావించి ముందుగా ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు..
విచారణలో హత్యకు పాల్పడింది పాత నేరస్తులు శివకోటయ్య, కిషోర్ గా గుర్తించి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. నిందితులు పట్టుబడితే ఈ కేసుకి సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు పోలీసులు.