Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది. అప్పట్లో దానిపై చిన్న,పెద్ద నిర్మాతలంతా హర్షం వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. చాలా వరకూ చిన్న సినిమాలు నాలుగు వారాల లోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, తాటి సునీతతో కలిసి నిర్మించిన ‘శాకిని డాకిని’ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను ఓటీటీ కోసమే తీశామని దర్శకుడు సుధీర్ వర్మ గతంలో చెప్పారు. కానీ అతనితో విభేదించిన నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధపడి, ఈ నెల 16న మూవీని రిలీజ్ చేశారు. కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిన ‘శాకిని డాకిని’ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. సరిగ్గా రెండు వారాలు గడిచిందో లేదో…. ఇప్పుడీ సినిమాను ఇదే నెల 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్లాప్ అయిన సినిమా రెండోవారమే ఓటీటీలో వచ్చేస్తుందంటే ఇక జనాలు థియేటర్లకు ఎందుకు వెళతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
సదరు సినిమా ఫ్లాప్ అయితే పది, పదిహేను రోజులు ఓపిక పడితే ఇంటిలోనే ఉండి ఓటీటీలో చూసే అవకాశం లభిస్తే… వందలు ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్ళడంలో అర్థమే లేదన్నది వారి వాదన. అయితే… త్వరలో విడుదల కాబోయే చిన్న సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రెండో వారానికి ఓటీటీలో వస్తాయని తెలిసినప్పుడు… థియేటర్ లో చూడాలని అనుకున్న వారు కూడా మనసు మార్చుకుని కొద్ది రోజులు ఓపిక పట్టడానికే మొగ్గు చూపుతారు. ‘శాకిని డాకిని’ అనే కాదు… ఈ నెల 2న విడుదలైన ‘బుజ్జి ఇలారా’, గత నెల 31న వచ్చిన ‘కోబ్రా’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే సెప్టెంబర్ 8న వచ్చిన ‘కెప్టెన్’ మూవీ 30వ తేదీన, 2న వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ అక్టోబర్ 2న ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. మొత్తం మీద ఓటీటీలు చాపకింద నీరులా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియెన్స్ కు దూరం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!