Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది. అప్పట్లో దానిపై చిన్న,పెద్ద నిర్మాతలంతా హర్షం వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. చాలా వరకూ చిన్న సినిమాలు నాలుగు వారాల లోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, తాటి సునీతతో కలిసి నిర్మించిన ‘శాకిని డాకిని’ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను ఓటీటీ కోసమే తీశామని దర్శకుడు సుధీర్ వర్మ గతంలో చెప్పారు. కానీ అతనితో విభేదించిన నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధపడి, ఈ నెల 16న మూవీని రిలీజ్ చేశారు. కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిన ‘శాకిని డాకిని’ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. సరిగ్గా రెండు వారాలు గడిచిందో లేదో…. ఇప్పుడీ సినిమాను ఇదే నెల 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్లాప్ అయిన సినిమా రెండోవారమే ఓటీటీలో వచ్చేస్తుందంటే ఇక జనాలు థియేటర్లకు ఎందుకు వెళతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
సదరు సినిమా ఫ్లాప్ అయితే పది, పదిహేను రోజులు ఓపిక పడితే ఇంటిలోనే ఉండి ఓటీటీలో చూసే అవకాశం లభిస్తే… వందలు ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్ళడంలో అర్థమే లేదన్నది వారి వాదన. అయితే… త్వరలో విడుదల కాబోయే చిన్న సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రెండో వారానికి ఓటీటీలో వస్తాయని తెలిసినప్పుడు… థియేటర్ లో చూడాలని అనుకున్న వారు కూడా మనసు మార్చుకుని కొద్ది రోజులు ఓపిక పట్టడానికే మొగ్గు చూపుతారు. ‘శాకిని డాకిని’ అనే కాదు… ఈ నెల 2న విడుదలైన ‘బుజ్జి ఇలారా’, గత నెల 31న వచ్చిన ‘కోబ్రా’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే సెప్టెంబర్ 8న వచ్చిన ‘కెప్టెన్’ మూవీ 30వ తేదీన, 2న వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ అక్టోబర్ 2న ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. మొత్తం మీద ఓటీటీలు చాపకింద నీరులా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియెన్స్ కు దూరం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!