Tollywood: రిలీజైన రెండోవారంలోనే ఓటీటీలో! ఇక థియేటర్ కెందుకొస్తారు!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఓటీటీల కారణంగా సినిమా థియేటర్ కు ప్రేక్షకులు రావడం లేదని నిర్మాతలు ఆ మధ్య గగ్గోలు పెట్టారు. దాంతో సినిమా విడుదలైన వెంటనే ఓటీటీలకు ఇవ్వకూడదని కనీసం మూడ, నాలుగు వారాల గ్యాప్ తో చిన్న సినిమాలను, యాభై రోజులు దాటిన తర్వాతే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ కు ఇవ్వాలని నిర్మాత మండలి సలహా ఇచ్చింది. అప్పట్లో దానిపై చిన్న,పెద్ద నిర్మాతలంతా హర్షం వెలిబుచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా మారిపోయింది. చాలా వరకూ చిన్న సినిమాలు నాలుగు వారాల లోపే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు, తాటి సునీతతో కలిసి నిర్మించిన ‘శాకిని డాకిని’ మూవీ విడుదలైన రెండు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ‘ఈ సినిమాను ఓటీటీ కోసమే తీశామని దర్శకుడు సుధీర్ వర్మ గతంలో చెప్పారు. కానీ అతనితో విభేదించిన నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధపడి, ఈ నెల 16న మూవీని రిలీజ్ చేశారు. కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కిన ‘శాకిని డాకిని’ జనాలను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. సరిగ్గా రెండు వారాలు గడిచిందో లేదో…. ఇప్పుడీ సినిమాను ఇదే నెల 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇలా ఫ్లాప్ అయిన సినిమా రెండోవారమే ఓటీటీలో వచ్చేస్తుందంటే ఇక జనాలు థియేటర్లకు ఎందుకు వెళతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
సదరు సినిమా ఫ్లాప్ అయితే పది, పదిహేను రోజులు ఓపిక పడితే ఇంటిలోనే ఉండి ఓటీటీలో చూసే అవకాశం లభిస్తే… వందలు ఖర్చు పెట్టి థియేటర్లకు వెళ్ళడంలో అర్థమే లేదన్నది వారి వాదన. అయితే… త్వరలో విడుదల కాబోయే చిన్న సినిమాల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రెండో వారానికి ఓటీటీలో వస్తాయని తెలిసినప్పుడు… థియేటర్ లో చూడాలని అనుకున్న వారు కూడా మనసు మార్చుకుని కొద్ది రోజులు ఓపిక పట్టడానికే మొగ్గు చూపుతారు. ‘శాకిని డాకిని’ అనే కాదు… ఈ నెల 2న విడుదలైన ‘బుజ్జి ఇలారా’, గత నెల 31న వచ్చిన ‘కోబ్రా’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలానే సెప్టెంబర్ 8న వచ్చిన ‘కెప్టెన్’ మూవీ 30వ తేదీన, 2న వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ అక్టోబర్ 2న ఓటీటీలో ప్రసారం కాబోతున్నాయి. మొత్తం మీద ఓటీటీలు చాపకింద నీరులా థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ను ఆడియెన్స్ కు దూరం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!