Perni Nani: హత్య చేసిన చేతులతో.. దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు
Perni Nani Comments On Chandrababu Naidu In NTR Centenary Celebrations: ఓవైపు సీనియర్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపిస్తూ.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్కు.. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించేకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నమని కీర్తించారు. పేదలకు రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు.
Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
పేదలకు పక్కా ఇల్లు పథకం ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని.. మునసబుదారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు మేలు చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని, అలాంటి ఎన్టీఆర్కు ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి రావడాన్ని చూస్తే బాధేస్తోందని భావోద్వేగానికి లోనయ్యారురు. తనని కుర్చీలోంచి కూలదోసి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించుకునే దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గుల చేతుల మీదుగా వర్ధంతులు, జయంతులు జరిపించుకోవాల్సిన దుస్థితి ఎన్టీఆర్కు పట్టిందన్నారు. హత్య చేసిన చేతులతో దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. ఏరుదాటాక తెప్పతగలెట్టే రకమని విమర్శించారు. అరచేతితో సూరీడుని అడ్డుకోలేరన్న ఆయన.. 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
కాగా.. ఈ వేడుకల్లో లక్ష్మీపార్వతి కూడా పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే.. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై తాను ఎంతో పోరాడానని, కానీ తన ఆవేదనని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని అన్నారు. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్కు అసలైన వారసుడు అని తేల్చి చెప్పారు. సరిగ్గా మాట్లాడ్డం కూడా రాని లోకేష్ తానే ఎన్టీఆర్ వారసుడిని చెప్పుకుంటున్నాడని, ఎన్టీఆర్ను మోసం చేసిన ఈ దుర్మార్గులు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పడానికి.. బ్యానర్ పెట్టడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఈ వేడుకలకు నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!