Perni Nani: హత్య చేసిన చేతులతో.. దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Perni Nani Comments On Chandrababu Naidu In NTR Centenary Celebrations: ఓవైపు సీనియర్ ఎన్టీఆర్పై ప్రశంసలు కురిపిస్తూ.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. ఎంతో చరిత్ర కలిగిన ఎన్టీఆర్కు.. తనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించేకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనం గుండెల్ని గెలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ పార్టీల నేతలకు సింహస్వప్నమని కీర్తించారు. పేదలకు రూ.2లకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు.
Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
పేదలకు పక్కా ఇల్లు పథకం ప్రవేశపెట్టిన ఒకే ఒక్కడు ఎన్టీఆర్ అని.. మునసబుదారీ వ్యవస్థను రద్దు చేసి, రైతులకు మేలు చేశారని పేర్ని నాని పేర్కొన్నారు. తెలుగువారి ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర అని, అలాంటి ఎన్టీఆర్కు ఈరోజు దౌర్భాగ్య పరిస్థితి రావడాన్ని చూస్తే బాధేస్తోందని భావోద్వేగానికి లోనయ్యారురు. తనని కుర్చీలోంచి కూలదోసి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో దండ వేయించుకునే దుస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఇలాంటి దుర్మార్గుల చేతుల మీదుగా వర్ధంతులు, జయంతులు జరిపించుకోవాల్సిన దుస్థితి ఎన్టీఆర్కు పట్టిందన్నారు. హత్య చేసిన చేతులతో దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు అని.. ఏరుదాటాక తెప్పతగలెట్టే రకమని విమర్శించారు. అరచేతితో సూరీడుని అడ్డుకోలేరన్న ఆయన.. 2024లో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
కాగా.. ఈ వేడుకల్లో లక్ష్మీపార్వతి కూడా పాల్గొన్నారు. విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే.. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై తాను ఎంతో పోరాడానని, కానీ తన ఆవేదనని ఏ ఒక్కరూ పట్టించుకోలేదని అన్నారు. దేవినేని నెహ్రూ మాత్రమే ఎన్టీఆర్కు అసలైన వారసుడు అని తేల్చి చెప్పారు. సరిగ్గా మాట్లాడ్డం కూడా రాని లోకేష్ తానే ఎన్టీఆర్ వారసుడిని చెప్పుకుంటున్నాడని, ఎన్టీఆర్ను మోసం చేసిన ఈ దుర్మార్గులు వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు చెప్పడానికి.. బ్యానర్ పెట్టడానికి చంద్రబాబుకు అర్హత లేదన్నారు. ఈ వేడుకలకు నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘సియా’ది ఇంత క్రిమినల్ మైండా? ప్రియుడి మైండ్ బ్లోయింగ్ స్టేట్మెంట్
-
Rao Bahadur: “మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!” రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
-
High Court of Telangana: హైకోర్టులో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు స్వల్ప ఊరట
-
Kitchen Tips: పప్పు డబ్బాల్లో పురుగులు ఉన్నాయా..? అయితే ఈ 7 టిప్స్ మీ కోసం..
-
Passport Citizenship Controversy: పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదా?.. విదేశాంగ శాఖ ప్రకటనపై రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!