Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: కొత్తగా నియమితులైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన కార్యదర్శి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి దొంగలను ఎలా పిలవాలి అని ఎద్దేవా చేశారు. షాలిమార్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇస్లామాబాద్ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా మళ్లీ తన ఇంటిపై దాడి చేసి పార్క్ చేసిన టయోటా హై లక్స్ ట్విన్ క్యాబిన్ మోడల్ 2011ని దొంగిలించారని, ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ కాలంలో తమ జీతాల కోసం పోలీసులు వాహనాలను చోరీ చేస్తున్నారని.. న్యాయవ్యవస్థ సభ్యులు, సివిల్ సర్వెంట్లు, దౌత్యవేత్తలు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోపించారు. “దొంగిలించబడిన నా వాహనంపై నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి? దొంగలను పట్టుకోమని దొంగలను అడగాలా?” అని ఆయన అన్నారు.
Also Read
- Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ఒమర్ అయూబ్ ఖాన్ పీటీఐ పార్టీ సెక్రటరీ జనరల్గా శనివారం నియమితులయ్యారు. ఇది గొప్ప గౌరవమని, తాను పాకిస్తాన్, పీటీఐ పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని, పీటీఐ సభ్యుల అంచనాలను అందుకోవడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. గతంలో కూడా, మాలిర్ కాంట్ పోలీసులు జాతీయ అసెంబ్లీ (MNA) మాజీ సభ్యుడు జమీల్ అహ్మద్ ఖాన్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను మే 9న అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేసి వారి ఇళ్లపై దాడులు చేశారు. అంతకుముందు, మాలిక్ వాజిద్, హాజీ షౌకత్ అలీ, అర్బాబ్ షేర్ అలీ, మురాద్ సయీద్, ఆయిషా బానోల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు ది ట్రిబ్యూన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. పోలీసుల దాడులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పీటీఐ విడుదల చేసింది. గతంలో పీటీఐ నేత ఉస్మాన్ దార్ నివాసంపై పోలీసులు దాడులు చేశారని పీటీఐ ఆరోపించింది. నాలుగు గోడల పవిత్రతకు భంగం కలిగించి దార్ సోదరుల తల్లిని వేధించారని పార్టీ పేర్కొంది.
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!