Pakistan: పోలీసులే నా కారును దొంగిలించారు.. పీటీఐ నేత ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: కొత్తగా నియమితులైన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రధాన కార్యదర్శి ఒమర్ అయూబ్ ఖాన్ ఆదివారం ఇస్లామాబాద్ పోలీసులు తన ఇంటిపై దాడి చేసి తన వాహనాన్ని దొంగిలించారని ఆరోపించారు. దొంగలను పట్టుకోవడానికి దొంగలను ఎలా పిలవాలి అని ఎద్దేవా చేశారు. షాలిమార్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇస్లామాబాద్ పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా మళ్లీ తన ఇంటిపై దాడి చేసి పార్క్ చేసిన టయోటా హై లక్స్ ట్విన్ క్యాబిన్ మోడల్ 2011ని దొంగిలించారని, ఇస్లామాబాద్ పోలీసులు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ద్రవ్యోల్బణ కాలంలో తమ జీతాల కోసం పోలీసులు వాహనాలను చోరీ చేస్తున్నారని.. న్యాయవ్యవస్థ సభ్యులు, సివిల్ సర్వెంట్లు, దౌత్యవేత్తలు తమ వాహనాలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆరోపించారు. “దొంగిలించబడిన నా వాహనంపై నేను ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి? దొంగలను పట్టుకోమని దొంగలను అడగాలా?” అని ఆయన అన్నారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ఒమర్ అయూబ్ ఖాన్ పీటీఐ పార్టీ సెక్రటరీ జనరల్గా శనివారం నియమితులయ్యారు. ఇది గొప్ప గౌరవమని, తాను పాకిస్తాన్, పీటీఐ పార్టీ కోసం నిరంతరం పని చేస్తానని, పీటీఐ సభ్యుల అంచనాలను అందుకోవడానికి తాను శాయశక్తులా ప్రయత్నిస్తానన్నారు. గతంలో కూడా, మాలిర్ కాంట్ పోలీసులు జాతీయ అసెంబ్లీ (MNA) మాజీ సభ్యుడు జమీల్ అహ్మద్ ఖాన్ ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ను మే 9న అరెస్టు చేసినప్పటి నుంచి ఆయన పార్టీకి చెందిన పలువురిని అరెస్టు చేసి వారి ఇళ్లపై దాడులు చేశారు. అంతకుముందు, మాలిక్ వాజిద్, హాజీ షౌకత్ అలీ, అర్బాబ్ షేర్ అలీ, మురాద్ సయీద్, ఆయిషా బానోల ఇళ్లపై పోలీసులు దాడులు చేసినట్లు ది ట్రిబ్యూన్ ఎక్స్ప్రెస్ నివేదించింది. పోలీసుల దాడులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని కూడా పీటీఐ విడుదల చేసింది. గతంలో పీటీఐ నేత ఉస్మాన్ దార్ నివాసంపై పోలీసులు దాడులు చేశారని పీటీఐ ఆరోపించింది. నాలుగు గోడల పవిత్రతకు భంగం కలిగించి దార్ సోదరుల తల్లిని వేధించారని పార్టీ పేర్కొంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!