YS Jagan: చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..
- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్..
- అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది..
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది..
- వీళ్లు చేసే పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు- వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. స్కూల్స్ పోయాయి, చదువులు పోయాయి, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, డోర్ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా, వ్యవసాయం ఇలా మొత్తం పోయాయని పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
Read Also: Jaggareddy: డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది.. దీంట్లో దాచుకునేది ఏముంది?
Also Read
ఇక, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదు.. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు.. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.. ఎన్యుమరేషన్ను సరిగ్గా చేయలేకపోయారు.. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమకు నచ్చినవారికి మాత్రమే వరద సాయం ఇస్తున్నారు.. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది.. అందుకనే ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదకి తెస్తున్నారు.. ఆ కొత్త టాపిక్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వీళ్ల చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
అలాగే, పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది.. నేను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమే.. పార్టీ మన అందరిదీ అన్న విషయాన్ని గుర్తించండి.. పార్టీకోసం కష్డపడేవారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పూర్తిగా అండగా ఉంటాం.. వారికే ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని మాజీ సీఎం చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశంలో అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు.. వారంతా పార్టీ మీద అధారపడి ఉన్నారు.. వీరందర్నీ మన పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలి.. గ్రామల వరకూ అనుబంధ విభాగాల నిర్మాణం కావాలి.. పార్టీ పిలుపు ఇస్తే పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ కదలిక రావాలి అని సూచించారు. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!