YS Jagan: చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..
- కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్..
- అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది..
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది..
- వీళ్లు చేసే పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు- వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మాజీ సీఎం, వైయస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4 నెలల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదన్నారు. చంద్రబాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. స్కూల్స్ పోయాయి, చదువులు పోయాయి, విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, డోర్ డెలివరీ, వాలంటీర్ల వ్యవస్థ, రైతు భరోసా, వ్యవసాయం ఇలా మొత్తం పోయాయని పేర్కొన్నారు. ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
Read Also: Jaggareddy: డాటా సరిగ్గాలేక రుణమాఫీ ఆలస్యమైంది.. దీంట్లో దాచుకునేది ఏముంది?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తప్పుడు కేసులు పెడుతున్నారు.. లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడంలేదు.. పారదర్శకత అన్నది ఎక్కడా లేదు.. విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతం.. ఎన్యుమరేషన్ను సరిగ్గా చేయలేకపోయారు.. కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. తమకు నచ్చినవారికి మాత్రమే వరద సాయం ఇస్తున్నారు.. పరిపాలన ఇంత ఘోరంగా ఉంది.. అందుకనే ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ తెరమీదకి తెస్తున్నారు.. ఆ కొత్త టాపిక్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వీళ్ల చేసిన పనులతో దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారు అని జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
అలాగే, పార్టీ బాగుంటేనే మనం అంతా బాగుంటాం అని వైఎస్ జగన్ అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుంది.. నేను కేవలం మీ అందరి ప్రతినిధిని మాత్రమే.. పార్టీ మన అందరిదీ అన్న విషయాన్ని గుర్తించండి.. పార్టీకోసం కష్డపడేవారికి, ఆ ప్రక్రియలో నష్టపోయినవారికి పూర్తిగా అండగా ఉంటాం.. వారికే ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని మాజీ సీఎం చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. దేశంలో అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం.. పార్టీకి లక్షల మంది కార్యకర్తలు, కోట్ల మంది అభిమానులు ఉన్నారు.. వారంతా పార్టీ మీద అధారపడి ఉన్నారు.. వీరందర్నీ మన పార్టీ వ్యవస్థల్లోకి తీసుకురావాలి.. గ్రామల వరకూ అనుబంధ విభాగాల నిర్మాణం కావాలి.. పార్టీ పిలుపు ఇస్తే పైస్థాయి నుంచి కింది స్థాయి వరకూ కదలిక రావాలి అని సూచించారు. ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!