Israel-Iran War: ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది.. ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ ఇజ్రాయెల్పై అనేక క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా ఇజ్రాయెల్ పౌరులు సురక్షితమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఈ దాడి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడిని “భయంకరమైన తప్పిదం”గా అభివర్ణించారు. మధ్యప్రాచ్య ముఖచిత్రాన్ని మార్చడానికి ఇజ్రాయెల్కు గత 50 ఏళ్లలో అతిపెద్ద అవకాశం ఇప్పుడు వచ్చిందని అన్నారు.
ఇరాన్ ఇజ్రాయెల్పై 108 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత నఫ్తాలీ బెన్నెట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఇప్పుడు చర్య తీసుకోవాలని, ఇరాన్ యొక్క అణు కార్యక్రమం, ఇంధన సౌకర్యాలను నాశనం చేయాలని ఆయన అన్నారు. “మిడిల్ ఈస్ట్ రూపురేఖలను మార్చడానికి ఇజ్రాయెల్కు ఇప్పుడు అతిపెద్ద అవకాశం ఉంది. ఇరాన్ భయంకరమైన తప్పు చేసింది. ఇజ్రాయెల్ ఇప్పుడు చర్య తీసుకోవాలి. ఇరాన్ను నాశనం చేయాలి. అణు కార్యక్రమం, దాని కేంద్ర ఇంధన సౌకర్యాలు, ఈ ఉగ్రవాద పాలనను పూర్తిగా నిర్వీర్యం చేయండి” అంటా ఇజ్రాయెల్ మాజీ ప్రధాని కీలక ప్రకటన చేశారు.
Also Read
Read Also: Israel-Iran War: త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం?
న్యూ రైట్ పార్టీ నాయకుడైన నఫ్తాలీ బెన్నెట్ గతంలో ఇజ్రాయెల్ యొక్క ప్రత్యేక సయెరెట్ మత్కల్ యూనిట్లో కమాండోగా ఉన్నారు. ఆయన జూన్ 2021 నుండి జూన్ 2022 వరకు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహును తొలగించిన తర్వాత 2021లో ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. ఇరాన్ను ఉగ్రవాదం యొక్క “ఆక్టోపస్” అని పిలిచాడు. హిజ్బుల్లా, హమాస్, హౌతీలు ఇజ్రాయెల్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆక్టోపస్ తలపై గురిపెట్టాలని బెన్నెట్ చెప్పారు.
ఇరాన్ క్షిపణి దాడికి ముందు.. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా , హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియే ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలలో మరణించారు. ఇరాన్ ప్రయోగించిన అనేక క్షిపణులను ఇజ్రాయెల్కు చెందిన అధునాతన రక్షణ వ్యవస్థలు అడ్డగించినప్పటికీ, కొన్ని క్షిపణులు ఇప్పటికీ వారి లక్ష్యాలను చేరుకున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇరాన్ చర్యను “పెద్ద తప్పు” అని పేర్కొన్న ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు దీనికి ఇరాన్ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. బెన్నెట్ తన పోస్ట్లో, “మాకు చట్టబద్ధత ఉంది. మాకు మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు హిజ్బుల్లా, హమాస్ పూర్తిగా నాశనం కావడంతో ఇరాన్ బహిర్గతమైంది. గత భయంకరమైన సంవత్సరంలో, ఇరాన్ సామ్రాజ్యాలు ఇజ్రాయెల్ కుటుంబాలను హత్య చేశాయి. వారు మా కుమార్తెలను అత్యాచారం చేశారు, దోచుకున్నారు. మా నగరాలు, మా నౌకలపై దాడి చేశాయి, ఇజ్రాయెల్ ఈ అవకాశాన్ని వృథా చేయవద్దు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!