Pedderu Bridge Work: పెద్దేరు నదిపై శరవేగంగా బ్రిడ్జి పనులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో పెద్దేరు నది ప్రవాహం పైన బ్రిడ్జి పాడైంది. ఒకవైపు అసనీ తుఫాన్ ప్రభావం వల్ల, గతంలో నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జరగడం వల్ల అధిక బరువు గ్రానైట్ లారీలు ప్రయాణం చేయడం వల్ల బ్రిడ్జి కుంగిన విషయం తెలిసిందే. శరవేగంగా కుంగిన వంతెన శ్లాబ్ తొలగింపు పనులు సాగుతున్నాయి.
వంతెన కుంగిపోవడంతో అధికారులు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. దీంతో పలు ప్రాంతాలకు చెందిన వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు సత్వరమే పరిష్కరించడానికి ఆర్ అండ్ బి అధికారులు చర్యలు చేపట్టారు. వంతెన కుంగిన ప్రదేశంలో ఆనకట్ట తరహాలో రాళ్లు పేర్చి ఆ పైన తారు రోడ్డు వేయనున్నట్లు చెప్పారు . వంతెన కుంగిన మూడు ఖానా లు మేరకు శ్లాబ్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. ఇంతకుముందు వంతెనపై రైలింగ్ రాడ్ లను తొలగించారు. వంతెన మొత్తం 20 ఖానా లు వీటిలో మూడు ఖానాలు మాత్రమే కుంగాయి. ఈ ప్రదేశంలో శ్లాబ్ ను తొలగించి. ఆయకట్టు తరహాలో కిందనుంచి వంతెన శ్లాబ్ స్థాయివరకూ రాళ్లను పేర్చి పటిష్టం చేస్తామని ఆ తర్వాత దానిపై తారురోడ్డు వేస్తామని అధికారులు వివరించారు. ఈ పనులు చేయడానికి 20 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
Also Read
- Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
- ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్'గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
వంతెన కుంగడంతో వ్యాపారాలు ఆగిపోయాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే వడ్డాది జంక్షన్ బోసిపోయింది. బ్రిడ్జి కుంగడంతో వడ్డాది జంక్షన్ లో వ్యాపారులంతా డీలా పడ్డారు రాకపోకలు లేక షాపులను చాలావరకూ మూసి వేశారు. ఇటీవల కాలంలో పునః ప్రారంభమైన వెంకటేశ్వర థియేటర్ సర్కారు వారి పాటకు కూడా ఆడియన్స్ కరువయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే ఆడపిల్లలకు నదీ ప్రవాహంలో నుండే పరీక్షలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లాలంటే సుమారు పది కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిందే.
వంతెన కూలడంతో ఆటో చార్జీలు పెరిగిపోయాయి డ్రైవర్లు ఒక్కసారిగా ఛార్జిలు రెట్టింపు చేశారు. గతంలో వడ్డాది గ్రామం నుండి చోడవరం కి చార్జి 20 రూపాయలు మాత్రమే ఉండగా ఇప్పుడు 40 రూపాయలు వసూలు చేస్తున్నారు ఆటోడ్రైవర్లు. వడ్డాది నుండి వయా గౌరీపట్నం మీదగా చోడవరంకి 35 రూపాయలు వసూలు చేస్తున్నారు వడ్డాది, బంగారుమెట్ట, లోపూడి, ఎల్ సింగవరం ,చినఅప్పన్నపాలెం తదితర గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తండ్రులే తమ పిల్లలను ఎక్కించుకొని విద్యార్థినులను నదీ పరివాహక ప్రాంతంలో దాటించే పరిస్థితి కనబడుతోంది. మూగజీవాలు సైతం రాకపోకలకు ఆలోచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ను ఖాళీ చేసిన విద్యార్థులు.. ఇళ్లకు వెళ్లిపోతున్న నిరసనకారులు
-
FCRA Bill: FCRA బిల్లు కోసం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా?.. ఎన్జీఓ, మిషనరీల్లో భయం, అమెరికాలో వ్యతిరేకత.. అసలేంటి ఈ బిల్లు..
-
Minister Seethakka : ఎల్ నీనో ఎఫెక్ట్పై సీతక్క అలర్ట్.. తెలంగాణలో తాగునీటి కొరతకు నో ఛాన్స్
-
Chandrababu: జంక్ ఫుడ్ తింటున్నాం.. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి: సీఎం చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కీలక అడుగు.. మోడీ కూడా క్షమాపణ చెప్పాలన్న రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!