Pawan Kalyan: రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే.. ఎందుకు స్పందించట్లేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Wishes AP State Formation Day: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్.. ప్రజలంతా నిత్య చైతన్యమూర్తులై పోరాడాలని స్పూర్తినింపారు. తెలుగు జాతి ఉనికి కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం పొట్టి శ్రీరాముల ప్రాణార్పణతో ఈ రాష్ట్రం అవతరించిందని అన్నారు. ఆంధ్రుల్లో ఎలాంటి చైతన్యం కోసం ఆ అమరజీవి తపించారో.. ఇప్పుడు ఆ చైతన్యం ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా.. ప్రజల్లో ఎందుకు స్పందన కరవైందని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా, రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా ఎందుకు మౌనం పాటిస్తున్నారని అడిగారు. పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా.. ఎందుకు ప్రశ్నించడం లేదు? అని మండిపడ్డారు.
ఏ లక్ష్యం కోసం అయితే ఆంధ్రప్రదేశ్ అవతరించిందో ఒక్కసారి మననం చేసుకోవాలని ప్రజలకు పవన్ మనవి చేసుకున్నారు. అక్రమార్కులు పాలన చేస్తుంటే.. చేష్టలుడిగి ఎన్నాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని అన్నారు. ఏపీ అవతరించిన పర్వదినాన.. బాధ్యతాయుతమైన పౌరులందరు ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. శాంతి సౌభాగ్యాలతో ఆంధ్రప్రదేశ్ విరాజిల్లేలా.. కార్యాచరణతో ముందుకు సాగాలి, గళమెత్తాలని పిలుపునిచ్చారు. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామి రాష్ట్రంగా నిలపాలంటే.. ఓటును ఆయుధంగా మలచుకోవాలని సూచించారు. కాగా.. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాటం చేయడంతో.. తొలుత ఉమ్మడి మద్రాస్ నుంచి విడిపోయి, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించగా, ఆ తర్వాత 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రం విలీన్ కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అయితే.. ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు నిర్వహించగా.. 2014 జూన్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించి, కొత్త రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే!
Also Read
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
తాజావార్తలు
-
Team India: వాళ్లు ఫ్యామిలీలతో గడపొద్దా..? మాజీ కెప్టెన్ ఆగ్రహం..
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
-
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ బిగ్ షాక్.. హార్ముజ్ మళ్లీ మూసివేత
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?