Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
- పొదుపు చర్యలపై కేబినెట్లో కీలక చర్చ
- ప్రజలకు అవగాహన తర్వాతే నిర్ణయం: పవన్
- వర్క్ ఫ్రం హోం, కార్ పూలింగ్పై ఫోకస్
- పొదుపు కోసం సబ్ కమిటీ ఏర్పాటు సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ పొదుపు చర్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య లోతైన చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టదలచిన పొదుపు చర్యలను ఒక్కసారిగా ప్రజలపై రుద్దకుండా, వారికి తగిన అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పొదుపు చర్యలను మనం ఒకేసారి ప్రజలకు వివరిస్తే వారు ఇబ్బంది పడే అవకాశం ఉందని, అందుకే ఈ విషయంలో నిదానంగా ముందుకు వెళ్దామని సూచించారు. ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెప్పిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి అదే బాటలో నడవాలని మంత్రులను ఆదేశించారు.
Also Read
- Tragedy: ఫోన్ వాడొద్దన్నందుకు.. ఇంటి నుంచి వెళ్లి చెరువులో దూకిన బాలుడు..
- AP Cabinet: ఉద్యోగులకు గుడ్న్యూస్.. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. కేబినెట్లో కీలక నిర్ణయాలు..
- Rare Fish: అంతర్వేదిలో అరుదైన ఫిష్.. మత్స్యకారులకు అదృష్టాన్ని తెచ్చిన 'మగ కచిడి చేప'!
- CI Nagaraju: సీఐ చిత్రహింసల వల్లే నా కొడుకు చనిపోయాడు.. వైరల్గా మారిన సాయికృష్ణ తల్లి ఫిర్యాదు లేఖ!
ఈ పొదుపు ప్రణాళికలో భాగంగా వర్క్ ఫ్రం హోం , కార్ పూలింగ్ వంటి ఆధునిక పద్ధతులను పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఎక్కడెక్కడ పొదుపు చేసే అవకాశం ఉందో నివేదికలు ఇవ్వాలని కార్యదర్శులను ఆదేశించడమే కాకుండా, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఒక కేబినెట్ సబ్కమిటీని నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రులు కూడా ఈ ప్రతిపాదనలతో ఏకీభవిస్తూ, ముందుగా రెండు రోజుల పాటు ప్రజలకు అన్ని విషయాలను స్పష్టంగా వివరించి, వారిని మానసికంగా సిద్ధం చేసిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మొత్తానికి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి భాగస్వామ్యంతోనే పొదుపు దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
Padma Awards: 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేత.. మమ్ముట్టి, మాధవన్కు గౌరవం
-
Infosys Recruitment: ఇన్ఫోసిస్లో సరికొత్త రిక్రూట్మెంట్.. 20,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు..
-
Diabetes: కోవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరుగుతున్న షుగర్ వ్యాధి..
ట్రెండింగ్
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!