Pawan Kalyan: పవన్ హెచ్చరిక.. సైలెన్సర్లు బిగించుకోకపోతే, మంత్రుల చిట్టా విప్పుతా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Gives Strong Warning: తన వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఓ హెచ్చరిక జారీ చేశారు. పదే పదే తన వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలందరూ తమ నోటికి సైలెన్సర్ బిగించుకోవాలని అన్నారు. తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే.. తనపై వ్యక్తిగతంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు లోతైన విషయాలు తెలుసని.. తలచుకుంటే తాను కూడా సీఎంతో పాటు మంత్రుల చిట్టా విప్పగలనని హెచ్చరించారు. తాను చెప్పేది వింటే.. జగన్ చెవుల్లో రక్తం కారుతుందని వ్యాఖ్యానించారు. అయితే.. తనకు సంస్కారం ఉంది కాబట్టి, చిల్లర మాటలు మాట్లాడట్లేదన్నారు. జగన్ గుర్తు పెట్టుకో.. ఫ్యాక్షన్ బ్యగ్రౌండ్ అని మిడిసిపడకని అన్నారు. తాను విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు.
Rashmi Gautham : వెరైటీ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో మతిపోగొడుతున్న రష్మీ.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
రాబోయే 25 ఏళ్ళు ఒక కూలీగా పని చేసేందుకు తాను వచ్చానని, వచ్చే ఎన్నికల్లో తనని మనస్పూర్తిగా గెలిపిస్తారని కోరుకుంటున్నానని పవన్ అన్నారు. సినిమా అభిమానుల్ని విడదీయడం తనకు ఇష్టం లేదని, అందరినీ ఆంధ్రప్రదేశ్ యువతగా మాత్రమేనని చూస్తానని అన్నారు. భీమవరంలో పోస్టర్ గొడవ జరిగితే తనకు చాలా బాధేసిందన్నారు. అప్పులు చేయడం వల్ల ఎక్కువ వడ్డీల రూపంలో పోతున్నాయన్నారు. భీమవరం 38 వార్డులతో పాటు రాష్ట్రమంతా కమిటెడ్ నాయకత్వం రావాలన్నారు. ఒక పదేళ్లు అన్ని మర్చిపోయి అంతా ఏకమవుదామని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ఉండేలా పాలసీ ఉండాలన్నారు. జన సైనికులకే రూ.5 లక్షల ఇన్సూరెన్స్ చేసినపుడు.. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కుటుంబాలకు ఎందుకు చేయలేవని ప్రశ్నించారు. తన స్వార్థం కోసం చూసుకునే మనిషిని కానని అన్నారు. ఏది ఏమైనా తాను పోరాటం ఆపనన్నారు. కులవైషమ్యాలు వదిలేయడం అలవాటు చేసుకుందామని పిలుపునిచ్చారు.
Pawan Kalyan: నాకు గెలుపోటములు ఉండవు.. ప్రయాణం తప్ప
తనకు ఢిల్లీ స్థాయి నాయకులతో పరిచయాలు ఉన్నాయని.. తాను ప్రధానిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గురించి అన్ని చెప్పొచ్చని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చినప్పుడు.. అందరి బండారం బట్టబయలు చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. రైతు నాయకులపై కేసులు పెట్టారని, తుందుర్రు ఆక్వా పార్క్ కోసం పోరాటం చేసిన వారిపై ఇంకా కేసులు ఉన్నాయని, తాము వచ్చాక వాటిని తీసేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై కేసులు పెడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. అభివృద్ధి జరగాలన్నా, ఆరచకాలు ఆగాలన్నా వైసీపీ పోవాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!