Pawan Kalyan: ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని.. పొత్తులపై చర్చలు అవసరమని.. పార్టీలు చాలా విశాల దృష్టితో ఆలోచించాలని పవన్ తెలిపారు. ఏపీ నిర్మాణానికి అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బీజేపీతో తమ పొత్తు కొనసాగుతోందని.. మోదీ, అమిత్ షా అంటే తనకు చాలా గౌరవం ఉందని పవన్ పేర్కొన్నారు.

Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని.. అప్పుడు ఏపీకి భవిష్యత్ ఉండదని పవన్ అన్నారు. డైరెక్టుగా చంద్రబాబు పొత్తుల ప్రస్తావన తీసుకొస్తే తాము పరిశీలిస్తామన్నారు. సోము వీర్రాజు ఏం మాట్లాడారో తనకు తెలియదని.. ఆయన వ్యాఖ్యలు విన్నాక స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదని పవన్ ఆరోపించారు. తాము ఏం చేసినా తిరుగు ఉండదనే విధంగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కౌలు రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకుని ఉంటే జనసేన రైతు భరోసా యాత్ర చేయాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!