తెలంగాణలో కంటే ముందే ఏపీలో అధికారంలోకి వస్తాం: పరిపూర్ణానంద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహసభలో ఆ పార్టీ నేత పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో తాను అడుగు పెట్టగానే.. ‘బండి’ కదిలిందని… ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా సోము బండి కదులుతుందన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కి పెంచేశారని.. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమన్నారు. జగన్ హిందూవునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఏపీలో పలు చోట్ల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా పట్టించుకోలేదని.. రామతీర్ధంలో రాముని తల తీసేసినా వ్యక్తిని పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. రథాన్ని చెక్క అంటూ ఓ మంత్రి కామెంట్ చేశారంటే ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు.
Read Also: న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్న్యూస్
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
తెలంగాణ కంటే ముందే ఏపీలోనే బీజేపీ ముందు అధికారంలోకి వస్తుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు-జగన్ ఇద్దరూ చారిత్రాక తప్పిదాలు చేశారని.. 2022 చివరికో.. 2023 ఆదిలోనో ఏపీ ప్రభుత్వం ఏమవుతుందో తానైతే చెప్పలేనన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఆత్మను ఏడిపించారని.. అదే చంద్రబాబును కన్నీళ్లు పెట్టించిందని పరిపూర్ణానంద ఆరోపణలు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెడితే… జగన్ మాతృభాషను జెరూసలెంలో తగులబెట్టారని… తెలుగు భాషను పట్టించుకోకుండా ఇంగ్లీష్ను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు.
అఖండ సినిమా ఏమో కానీ.. ప్రధాని మోదీ అసలైన అఖండుడు అని పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించారు. ఒవైసీని మోడీ-యోగి కలిసి బ్యాండ్ బజాయిస్తారని… అందుకు యూపీ నుంచి యోగి హైదరాబాద్ వరకు వస్తారన్నారు. మోడీ-యోగిని చూసి ఒవైసీ పారిపోవడం ఖాయమన్నారు. మందిరాలను నిర్మించడమే కాదు.. గుడిసెలను భవనాలుగా కూడా బీజేపీ మార్చగలదని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
-
New Smart Phone: 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10,000mAh బ్యాటరీ.. మొబైల్ రంగంలో సంచలనం..
-
CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
-
Sodium Metal Battery Breakthrough: కేవలం 4 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్.. శాస్త్రవేత్తల సంచలన పరిశోధన..
-
RBI Rule: బ్యాంక్ పొరపాటు వల్ల మీకు నష్టం జరిగిందా..? రూ.33 లక్షల పరిహారం పొందండిలా..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!