తెలంగాణలో కంటే ముందే ఏపీలో అధికారంలోకి వస్తాం: పరిపూర్ణానంద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో నిర్వహించిన బీజేపీ ప్రజాగ్రహసభలో ఆ పార్టీ నేత పరిపూర్ణానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో 2018లో తాను అడుగు పెట్టగానే.. ‘బండి’ కదిలిందని… ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టడంతో ఇక్కడ కూడా సోము బండి కదులుతుందన్నారు. ఏపీ ప్రజలు తెలియక ఫ్యాన్ స్పీడును 151కి పెంచేశారని.. ఎప్పుడైనా ఈ ఫ్యాన్ పడిపోవడం ఖాయమన్నారు. జగన్ హిందూవునని నమ్మించి ఓట్లేయించుకున్నారని ఆరోపించారు. ఏపీలో పలు చోట్ల ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసమైనా పట్టించుకోలేదని.. రామతీర్ధంలో రాముని తల తీసేసినా వ్యక్తిని పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. రథాన్ని చెక్క అంటూ ఓ మంత్రి కామెంట్ చేశారంటే ఏం అనాలో అర్థం కావడం లేదన్నారు.
Read Also: న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్న్యూస్
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
తెలంగాణ కంటే ముందే ఏపీలోనే బీజేపీ ముందు అధికారంలోకి వస్తుందని పరిపూర్ణానంద స్వామి అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబు-జగన్ ఇద్దరూ చారిత్రాక తప్పిదాలు చేశారని.. 2022 చివరికో.. 2023 ఆదిలోనో ఏపీ ప్రభుత్వం ఏమవుతుందో తానైతే చెప్పలేనన్నారు. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేస్తే… కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్టీఆర్ ఆత్మను ఏడిపించారని.. అదే చంద్రబాబును కన్నీళ్లు పెట్టించిందని పరిపూర్ణానంద ఆరోపణలు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ పాదాల దగ్గర చంద్రబాబు తాకట్టు పెడితే… జగన్ మాతృభాషను జెరూసలెంలో తగులబెట్టారని… తెలుగు భాషను పట్టించుకోకుండా ఇంగ్లీష్ను జగన్ నెత్తిన పెట్టుకుంటున్నారని విమర్శించారు.
అఖండ సినిమా ఏమో కానీ.. ప్రధాని మోదీ అసలైన అఖండుడు అని పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించారు. ఒవైసీని మోడీ-యోగి కలిసి బ్యాండ్ బజాయిస్తారని… అందుకు యూపీ నుంచి యోగి హైదరాబాద్ వరకు వస్తారన్నారు. మోడీ-యోగిని చూసి ఒవైసీ పారిపోవడం ఖాయమన్నారు. మందిరాలను నిర్మించడమే కాదు.. గుడిసెలను భవనాలుగా కూడా బీజేపీ మార్చగలదని పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
-
Team India-A: 452 పరుగులకు డిక్లేర్.. శతకాలతో తుక్కు రేపిన జురెల్, సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!