Kotappakonda: పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలతో కోటప్పకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రాక గంట గంటకూ పెరిగిపోతుంది. దీంతో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.
Read Also: Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
మరోవైపు భక్తుల రద్దీకి తగ్గట్లుగానే దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటిసారి వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ద్వారా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
Read Also: Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
అయితే, భక్తుల వాహనాలతో కోటప్పకొండకు వచ్చే రహదారులు రద్దీగా మారాయి. దీంతో కోటప్పకొండ పైకి వెళ్లేందుకు 120 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ నడిపిస్తుంది. అలాగే, భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలలో ఉన్న వారికి మంచినీళ్లు అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది.