Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaratri Upavasam: మహా శివరాత్రి రోజున ప్రధానంగా చేసేవి రెండే రెండు ముఖ్యం. ఒకటి ఉపవాసం, రెండోది జాగరణ. ఈ రోజున శివ భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరణ చేస్తుంటారు. మీరు కూడా ఈ రోజు ఈ రెండూ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం పదండి..
Also Read
ఉపవాసం మీనింగ్:
ఉపవాసం అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే ఏం తినకుండా ఉండడం అని.. కానీ అసలు ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట.. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. పూజ చేసే సమయంలో ఏ దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే.. శివునికి అతి దగ్గరగా ఉండాలి.. జ్ఞానేంద్రియాలను ఆ పరమ శివుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయడం బెటర్. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ఇక, ఉపవాసం అంటే ఏం తినకూడదని చెప్తుంటారు.. అంటే నోటి ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు పేర్కొంటున్నారు. కానీ, ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పొద్దు.. అది అశనమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలా అన్నారని.. ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట.. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపుకు మంచి రిలేషన్ ఉంటుంది.. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్ తప్పుతాయి.. కాబట్టి అల్పంగా చేయడం బెటర్.
Read Also:Couple Friendly: ప్రభాస్ మెచ్చిన ప్రేమకథ.. సంతోష్ శోభన్ మూవీపై డార్లింగ్ ప్రశంసలు!
సాత్వికమైన ఆహారమే..
ఆహారం అనేది మానవ శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట.. సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసించకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. తక్కువ మోతాదులో తీసుకుని ఉపవాసం చేయవచ్చని వెల్లడిస్తున్నారు.
ఉపవాసం అలా చేయకూడదు..
ఏం తినకుండా కూర్చోవటం.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆహారాన్ని నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటున్నారు. చాలామంది డ్యూటీలకి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతర పనులకు దగ్గరగా ఉంటారు. అలాగే, జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉంటుంది కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం.. జాగరణే కాదంటున్నారు. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేయడం మంచింది.
నిజమైన ఉపవాసం ఇదే..
మధుమేహం ఉన్నవారు సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది దీక్ష భంగమైనట్లు కాదు.. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడు.. అది ఉపవాసం భంగంలోకి రాదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటారో ఆ భగవంతుని సేవల్లో కూడా అంతే ఉండటమే నిజమైన ఉపవాసమని పండితులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!