Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shivaratri Upavasam: మహా శివరాత్రి రోజున ప్రధానంగా చేసేవి రెండే రెండు ముఖ్యం. ఒకటి ఉపవాసం, రెండోది జాగరణ. ఈ రోజున శివ భక్తులు ఉదయం నుంచి ఉపవాసం చేసి.. రాత్రంతా జాగరణ చేస్తుంటారు. మీరు కూడా ఈ రోజు ఈ రెండూ చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి ఎంటో ఇప్పుడు చూద్దాం పదండి..
Also Read
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
- Sri Hari Stotram: తొలి ఏకాదశి వేళ భక్తి టీవీలో అమృతతుల్యమైన "శ్రీహరి స్తోత్రం".. తప్పక వినండి!
- Saturday Horoscope: నేడు ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.!
- Guru Purnima 2026: గురు పౌర్ణమి జూలై 28నా? 29నా? సరైన తేదీ, శుభ ముహూర్తం, పూజా విధానం ఇదే
ఉపవాసం మీనింగ్:
ఉపవాసం అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే ఏం తినకుండా ఉండడం అని.. కానీ అసలు ఉప అంటే సమీపం.. వాసం అంటే ఉండుట.. దేనికి సమీపంగా ఉండాలి అంటే.. పూజ చేసే సమయంలో ఏ దేవుడి కోసం ఉపవాసం చేస్తున్నారో ఆ దేవునికి దగ్గరగా ఉండాలని అర్థం. శివరాత్రి రోజు ఉపవాసం చేస్తే.. శివునికి అతి దగ్గరగా ఉండాలి.. జ్ఞానేంద్రియాలను ఆ పరమ శివుడిపై నిమగ్నం చేస్తూ ఈ ఉపవాసం చేయడం బెటర్. అప్పుడే దానికి పరమార్థం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు.
ఇక, ఉపవాసం అంటే ఏం తినకూడదని చెప్తుంటారు.. అంటే నోటి ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోకుండా.. కడుపులోకి ఏ పదార్థం చేర్చకుండా ఉండాలని కొందరు పేర్కొంటున్నారు. కానీ, ఉపవాసం గురించి ఎప్పుడూ అలా చెప్పొద్దు.. అది అశనమవుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలా అన్నారని.. ప్రతిరోజూ తిన్నట్లు తినకూడదట.. ఎందుకంటే ఇంద్రియములకు, కడుపుకు మంచి రిలేషన్ ఉంటుంది.. పూర్తిగా తినడం వల్ల ఇవి కంట్రోల్ తప్పుతాయి.. కాబట్టి అల్పంగా చేయడం బెటర్.
Read Also:Couple Friendly: ప్రభాస్ మెచ్చిన ప్రేమకథ.. సంతోష్ శోభన్ మూవీపై డార్లింగ్ ప్రశంసలు!
సాత్వికమైన ఆహారమే..
ఆహారం అనేది మానవ శరీరాన్ని నిలపగలిగేలా ఉండేలా చూసుకోవాలట.. సాత్వికంగా ఉండే ఫుడ్ తీసుకుంటే.. జ్ఞానేంద్రియాలు కూడా చేసే పూజపై నిమగ్నమై ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంద్రియములు సహకరించడానికి, శరీరం నీరసించకుండా ఉండేందుకు సాత్వికమైన ఆహారాన్ని.. తక్కువ మోతాదులో తీసుకుని ఉపవాసం చేయవచ్చని వెల్లడిస్తున్నారు.
ఉపవాసం అలా చేయకూడదు..
ఏం తినకుండా కూర్చోవటం.. ఇతర పనులు చేసుకోవడం ఉపవాసమే కాదని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆహారాన్ని నియంత్రణ చేస్తూ.. దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అంటున్నారు. చాలామంది డ్యూటీలకి వెళ్తూ.. దేవుడికి దూరంగా ఇతర పనులకు దగ్గరగా ఉంటారు. అలాగే, జాగారం కూడా దేవుడికి సంబంధించిన పనుల్లో, పూజల్లో నిమగ్నమై ఉంటుంది కానీ.. ఇతర పనుల్లో బిజీగా ఉంటూ పడుకోకుండా ఉండడం.. జాగరణే కాదంటున్నారు. ఈ పద్ధతిలో ఉపవాసం, జాగరణ చేయడం మంచింది.
నిజమైన ఉపవాసం ఇదే..
మధుమేహం ఉన్నవారు సాత్వికమైన ఆహారం తీసుకుంటే అది దీక్ష భంగమైనట్లు కాదు.. శరీరాన్ని నిలబడడానికి ఓ పండు లేదా పాలు తీసుకున్నాడని భగవంతుడు అనుకుంటాడు.. అది ఉపవాసం భంగంలోకి రాదని జ్యోతిష్యులు చెప్తున్నారు. అవసరం లేకుండా కడుపు నిండా తినేస్తే దోషాలు సంభవించే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటారో ఆ భగవంతుని సేవల్లో కూడా అంతే ఉండటమే నిజమైన ఉపవాసమని పండితులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!