Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
- సరస్వతి పవర్ ప్లాంట్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్..
- అధికారుల నివేదికతో ప్రభుత్వం కీలక నిర్ణయం..
- అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saraswati Power Plant Lands: సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.. దీంతో సరస్వతి భూముల్లో నుండి 24.85 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ, ఆ భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు అధికారులు.
Read Also: Minister Seethakka: 3410 గ్రామాల్లో గ్రామసభలు.. 142 ఊళ్లలో గొడవలు చేసింది వాళ్లే..
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం.. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను రైతు నుండి కొనుగోలు చేసింది సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే, అప్పటినుండి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపించాయి. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదం ఉండటంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములపై సర్వే చేసింది.. అయితే, ఈ భూముల్లో అటవీ భూములు తేలలేదు.. కానీ, అసైన్డ్ ల్యాండ్స్ మాత్రం బయటపడ్డాయి.
గత నవంబర్లో అసైన్డ్ లైన్స్ కు సంబంధించిన వ్యవహారంపై సర్వే నిర్వహించారు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు.. అయితే, ఇందులో భాగంగా వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు.. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నిలిలో 4.84 సెంట్లు అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు అధికారులు. దీంతో, ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, అరుణ్ బాబు, సరస్వతీ పవర్ ప్లాంట్స్ కు రిజిస్టర్ అయిన అసైన్డ్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, బుధవారం పిడుగురాళ్ల ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సురేష్ బాబు.. సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు…
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!