Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Government Cancels Registration Of Assigned Lands In Saraswati Power Plant Land

Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..

Published Date :January 22, 2025 , 7:22 pm
By Sudhakar Ravula
  • సరస్వతి పవర్ ప్లాంట్ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్..
  • అధికారుల నివేదికతో ప్రభుత్వం కీలక నిర్ణయం..
  • అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు..
Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Saraswati Power Plant Lands: సరస్వతి భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.. పలనాడు ప్రాంతంలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన భూముల్లో 24.85 ఎకరాల అసైన్డ్‌ ల్యాండ్స్ ఉన్నట్లు గుర్తించింది అధికార యంత్రాంగం.. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, అసైన్డ్ ల్యాండ్స్ కేటాయింపును రద్దు చేశారు.. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.. దీంతో సరస్వతి భూముల్లో నుండి 24.85 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ, ఆ భూముల రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు అధికారులు.

Read Also: Minister Seethakka: 3410 గ్రామాల్లో గ్రామసభలు.. 142 ఊళ్లలో గొడవలు చేసింది వాళ్లే..

Also Read

  • Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్‌.. మరో కేసు నమోదు..
  • Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్‌గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్‌ హత్య..
  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ ప్లాంట్స్ కు కేటాయించిన 24.84 ఎకరాల అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ ను రద్దు చేసింది ప్రభుత్వం.. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలను రైతు నుండి కొనుగోలు చేసింది సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం. అయితే, అప్పటినుండి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్న ఆరోపణలు స్థానికుల నుండి వినిపించాయి. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదం ఉండటంతో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కూడా ఈ ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత మరింత లోతుగా దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికార యంత్రాంగం సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములపై సర్వే చేసింది.. అయితే, ఈ భూముల్లో అటవీ భూములు తేలలేదు.. కానీ, అసైన్డ్ ల్యాండ్స్ మాత్రం బయటపడ్డాయి.

Read Also: PM Surya Ghar Muft Bijli Yojana: సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన తొలి కోఆర్డినేషన్‌ కమిటీ భేటీ.. సీఎస్‌ కీలక ఆదేశాలు

గత నవంబర్‌లో అసైన్డ్‌ లైన్స్ కు సంబంధించిన వ్యవహారంపై సర్వే నిర్వహించారు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు.. అయితే, ఇందులో భాగంగా వేమవరం పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు.. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నిలిలో 4.84 సెంట్లు అసైన్డ్ భూములు ఉన్నాయని గుర్తించారు అధికారులు. దీంతో, ఈ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు కోరుతూ ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్, అరుణ్ బాబు, సరస్వతీ పవర్ ప్లాంట్స్ కు రిజిస్టర్ అయిన అసైన్డ్ ల్యాండ్ ల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, బుధవారం పిడుగురాళ్ల ఇంచార్జ్ సబ్ రిజిస్టర్ సురేష్ బాబు.. సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ లను రద్దు చేశారు…

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Government
  • assigned lands
  • Saraswati Power Plant
  • Saraswati Power Plant land

తాజావార్తలు

  • Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions