Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Ntv Short News Highlights On Jan 9th

ఎన్టీవీ షార్ట్ న్యూస్

Published Date :January 9, 2022 , 1:24 pm
By Ramesh Nalam
ఎన్టీవీ షార్ట్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

1) భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు… ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన బులెటిన్‌లో కొత్తగా 1,59,632 కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో 327 మంది కరోనాతో మృతి చెందారు. అటు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 3,623కి చేరింది.

2) ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని వైసీపీ ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన షాక్‌తోనే ఈరోజు చంద్రబాబు కుప్పం చుట్టూ తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే ముందు కుప్పం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు.

Also Read

  • AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
  • Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్‌లైన్స్‌లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
  • Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..

3) హీరో మహేష్‌బాబు సోదరుడు రమేష్‌బాబు మృతి పట్ల చిరంజీవి, పవన్ కళ్యాణ్, మాజీ సీఎం చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్ సహా పలువురు ప్రముఖులు రమేష్‌బాబు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కరోనా నిబంధనలను అనుసరించి రమేష్‌బాబు అంత్యక్రియలు జరుగుతున్నాయి.

4) ఏపీలో సంచలనం సృష్టించిన పాలడుగు గ్యాంగ్ రేప్ ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలియజేశారు

5) కరోనా థర్డ్ వేవ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకు వైద్య నిపుణులు, కేంద్ర మంత్రులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. కరోనాను ఎలా కట్టడి చేయాలి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం, లాక్‌ డౌన్‌ ప్రకటిస్తే జరిగే పరిణామాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు.

6)తెలంగాణ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పంట భీమా అమలు చేయని ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే అన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల ను ఆశ్రయించాల్సి వస్తోందని …రైతు సంక్షేమం కోరే వాళ్ళే అయితే వెంటనే పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

7) వరంగల్ లో 317 జీవోకి వ్యతిరేకంగా వరంగల్ లో బీజేపీ నిరసన సభ జరిగింది. ఈ సభకు అస్సాం సీఎం హేమంత్ శర్మ, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గరికపాటి మోహన్ రావు తదితరులు హాజరయ్యారు.

8) తిరుపతిలో ఓ పావురం కలకలం రేపింది. పాకాల మండలం వెంకట్రామాపురంలో పావురం కాలికి ట్యాగ్‌తో గ్రామస్థులకు కనిపించింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు గ్రామస్తులు. ట్యాగ్ పై సెల్ నెంబర్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు పోలీసులు. తమిళనాడులోని వేలూరులో పావురాల పందెం నుంచి వచ్చినట్లు గుర్తించారు.

9) సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. ఆయన చితికి కుమారుడు జయకృష్ణ నిప్పు పెట్టారు. కోవిడ్ నిబంధనలతో అతి కొద్దిమంది సమక్షంలోనే రమేష్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా మహేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేదు.

10) కరోనా ఎవరినీ వదలడం లేదు. జార్ఖండ్ సీఎం హేమంత్​సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్‌ బారినపడ్డారు. వీరిలో సోరెన్ మరదలు సరళ మర్ముకూ కూడా ఉన్నారు. అయితే, సీఎంకు నిర్వహించిన పరీక్షల్లో మాత్రం నెగెటివ్‌ వచ్చింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • latest news
  • news updates
  • ntv short news
  • telangana

తాజావార్తలు

  • Mark Zuckerberg: ఫేస్‌బుక్‌ను సృష్టించిన ‘డ్రాపౌట్’.. వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన జుకర్‌బర్గ్‌కు డిగ్రీ లేదు తెలుసా!

  • TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..

  • Cigarette Price Hike: సిగరెట్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. మే నెలలో పెరగనున్న సిగరెట్ ధరలు?

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీపై రూ.10 కోట్లు..! ఆ జట్టు కొనుగోలు చేసే అవకాశం..

  • Rohit Sharma గాయంపై కీలక అప్డేట్.. కెప్టెన్ Hardik Pandya ఏమన్నాడంటే.!

ట్రెండింగ్‌

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?

  • Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్‌లో బంధువులు!

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions