MLA Kolikapudi: తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా
- తిరువూరు పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా..
- టీడీపీలో విభేదాలు.. పోలీస్ స్టేషన్ కి చేరిన ఇద్దరు కార్యకర్తల మధ్య కొట్లాట..
- రామకృష్ణ అనే కార్యకర్తకు మద్దతుగా వచ్చిన ఎమ్మెల్యే కొలికపూడి పోలీసులపై ఆగ్రహం..
MLA Kolikapudi: ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హంగామా సృష్టించాడు. ఇద్దరు టీడీపీ కార్యకర్తల మధ్య కొట్లాట జరిగింది. చిల్లపల్లి రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్తపై దాడికి యత్నించిన అదే పార్టీకి చెందిన కందిమల్ల సాయి సుమిత్, పానుగంటి వెంకట్, మరో నలుగురు వ్యక్తులు.. తనపై దాడి నుంచి తప్పించుకునే యత్నంలో సాయి సుమిత్ పై సీసాతో కొట్టిన రామకృష్ణ. ఇక, సాయి సుమిత్ ఫిర్యాదుతో సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో రామకృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఉదయం తల్లి రాఘవమ్మ, సోదరి వరలక్ష్మీలను పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు. రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కూడా రామకృష్ణ తల్లి, సోదరుని స్టేషన్ లోనే ఉంచడంపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మండిపడ్డారు.
Read Also: Anil Kumar Yadav Mining Case: మాజీ మంత్రి అనిల్ మెడకు మైనింగ్ ఉచ్చు.. త్వరలో కేసు నమోదు చేసే ఛాన్స్
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayawada: కలెక్టరేట్లో కలకలం.. భూ వివాదం పరిష్కారం కాకపోవడంతో అధికారిపై కారం చల్లిన వృద్ధురాలు..!
- Instagram Harassment Case: మైనర్ బాలికకు ఇన్స్టాలో వేధింపులు.. పోక్సో, కిడ్నాప్ కేసు నమోదు..
- Minister Nara Lokesh: మైలవరం స్కూల్లో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్ వార్నింగ్..
అయితే, అసలు రామకృష్ణ ఇంటిపై దాడికి వచ్చిన సాయి సుమిత్.. దాడికి యత్నించిన వారిని విడిచిపెట్టి ఆత్మరక్షణ కోసం దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టడం అమానుషం అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. దాడి జరిగితే కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. కానీ, సాయి సుమిత్ వెనుక కొందరు ఉండి ఎస్ఐ కేవీజీవి సత్యనారాయణపై ఒత్తిడి తెచ్చి అన్యాయంగా అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆరోపించారు. తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలకు కొమ్ము కాస్తున్నారని ఇది సరైన విధానం కాదన్నారు. గంజాయి విక్రయించాలంటూ తమ కుమారుడ్ని ప్రోత్సహిస్తూనే అక్రమ కేసుల్లో బనయించారని ఎమ్మెల్యే ముందర ఓ బాధిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని స్టేషన్ కి పిలిపించాలని అంతవరకు కదిలేది లేదని స్టేషన్ లోనే ఎమ్మెల్యే కొలికపూడి కూర్చున్నారు. గత నెల రోజుల క్రితం ఇదే రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంత వరకు చర్యలు లేదని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్పై ఇరాన్ దాడులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!