రాష్ట్రం చేసే ప్రతి పనిలో మేము అండగా ఉంటాం : రాజీవ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పరస్పర సహకారంతో సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా మా వంతుగా కృషి చేస్తాము అని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో నాకెంతో నమ్మకం ఉంది. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు. వ్యవసాయానికి అండ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు బాగున్నాయి. ఇంకా మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్. ఇది నిజంగా ఎంతో అభినందనీయం. మహిళలకు ఎల్లవేళలా ఎంతో తోడుగా నిలుస్తోంది. దిశా యాప్ ను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తున్నాం.
ఇక కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్ విధానాన్ని కూడా ఇతర రాష్ట్రాలను అమలు చేయాలని కోరతాం అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాటిని అందజేస్తున్నారు. ఇది అభినందనీయం. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. దీని వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. ఎన్నో భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా రాష్ట్రం ముందు ఉంది. ఇది కూడా ప్రశంసనీయం అని చెప్పారు.
Also Read
- OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
అలాగే కోస్టల్ ఎకనామిక్ జోన్స్, ఎగుమతులు తదితర రంగాల్లో ఏపీ వృద్ధికి సహాయపడతాం. ఈ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాల్లో రాష్ట్రానికి చేయూత నిస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో.. ఆదాయం తగ్గిందన్న విషయం మాకు తెలుసు. సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. వ్యవసాయ రంగంలో రాష్ట్రం బాగా రాణిస్తోంది. ముఖ్యంగా నేచురల్ ఫార్మింగ్, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిల్చింది. రెవెన్యూ లోటును పూడ్చడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వీటన్నింటి కోసం ప్రయత్నిస్తాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే బాగుంటుంది. తద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు వస్తాయి అని తెలిపారు.
అయితే మీకు విశాల తీర ప్రాంతం ఉంది. వాటిలో ఎకనామిక్ జోన్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ముఖ్యం. పర్యాటక రంగం వల్ల కూడా ఆదాయం వస్తుంది. రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది. ఆ పొటెన్షియల్ ఇక్కడ ఉంది. ఈ విషయంలో నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ దిశలో మా వంతుగా పూర్తి సహాయ, సహకారాలు కూడా అందిస్తాం. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది కూడా ప్రశంసనీయం. దీని వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండదు. రాష్ట్రం చేసే ప్రతి పనిలో నీతి ఆయోగ్ మీకు అండగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!