MLCs Meets CM YS Jagan: సీఎంను కలిసిన నూతన టీచర్ ఎమ్మెల్సీలు.. జగన్ అభినందనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLCs Meets CM YS Jagan: తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన ఎమ్మెల్సీలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.. ఇక, ఇవాళ సీఎం వైఎస్ జగన్ను కలిశారు నూతన ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ. రామచంద్రారెడ్డి, ఎ. మధుసూదన్.. తాజాగా జరిగిన టీచర్ల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఇద్దరు గెలుపుపొందారు. తమకు ఎన్నికలకు అవకాశం కల్పించి.. గెలుపునకు కృషి చేసిన సీఎం వైఎస్ జగన్కు వారు కృతజ్ఞతలు తెలుపుకోగా.. మరోవైపు.. విజయం సాధించినవారికి అభినందలు తెలిపారు ముఖ్యమంత్రి జగన్.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కల్పలతా రెడ్డి, పి.చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.
ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి.. ఇద్దరు టీచర్స్ ఎమ్మెల్సీలను గెలిచాం.. ఇదొక చరిత్ర అన్నారు.. టీచర్స్ సమల్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.. టీచర్ల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. ఎన్నికల క్యాంపెయిన్ లో ఇచ్చిన రెండు హామీలను గెలవగానే సాధించాం అన్నారు.. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ను సర్వీసంతా వాడుకునేలా సీఎం నుంచి హామీ వచ్చింది.. మనసున్న మహరాజు జగన్ మోహన్ రెడ్డి.. ఇది మహిళా ప్రభుత్వం.. మహిళల సమస్యలను తీర్చే ప్రభుత్వం.. ఒక మహిళగా.. టీచర్స్ ఎమ్మెల్సీగా ఎంతో సంతోషిస్తున్నా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీచర్స్ తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇది నా జీవితంలో మర్చిపోని రోజు.. మేం ఏది అడిగినా వెంటనే స్పందించి తీరుస్తున్నారు అంటూ సీఎం జగన్పై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ఇక, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎంవీ, రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలుపొందాం.. గెలిచిన తొలిరోజే ఇచ్చిన రెండు హామీలను నెరవేర్చాం.. ప్రైవేట్ స్కూల్స్ రెన్యువల్స్ మూడేళ్ల నుంచి ఎనిమిదేళ్లకు పెంచుతామని హామీ ఇచ్చారని.. భవిష్యత్తులో టీచర్లకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రకటించారు. మరోవైపు.. తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.. నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు.. కొందరు చేస్తున్న కొన్ని పనుల వల్ల ప్రభుత్వానికి టీచర్లకు మధ్య గ్యాప్ ఏర్పడుతోందన్నారు. అయితే, మా సమస్యలు చెప్పగానే సీఎం జగన్ స్పాట్ లో జీవో జారీ చేయాలని చెప్పారని.. ఇలాంటి మంచి వ్యక్తి ఏపీకి సీఎంగా ఉండటం మన అదృష్టంగా అభివర్ణించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ భవిష్యత్తులో పరిష్కరిస్తాం.. మీ వెంటే మేముంటాం.. టీచర్లకు మేం అండగా నిలుస్తాం అన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి.



తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..