New Twist in Saipriya Case: మరోసారి ఝలక్ ఇచ్చిన సాయిప్రియ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ ఆర్కే బీచ్లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తున్నాయి.. మ్యారేజ్ డే రోజే భర్త కళ్లుగప్పి.. మిస్ అయిన ఆమె నెల్లూరులో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు.. ప్రియుడితో సాయిప్రియ వెళ్లిపోయినట్లు స్పష్టం చేశారు. నెల్లూరుకు చెందిన రవితో కొన్నాళ్లుగా సాయిప్రియ ప్రేమ వ్యవహారం నడుపుతోందని తెలిపారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో ఆర్కే బీచ్కు వెళ్లిన క్రమంలో భర్త మొబైల్ చూస్తున్న సమయంలో సాయిప్రియ లవర్తో పారిపోయినట్టు నిర్ధారణకు వచ్చారు.. అయితే సముద్రంలో గల్లంతైనట్లు భర్త శ్రీనివాస్ భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమె కోసం రెండ్రోజులుగా నేవీ హెలికాప్టర్తో అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం.. ఇలా ఎంతో హడావిడి జరిగింది.. అయితే, ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చింది సాయిప్రియ… విశాఖ ఆర్కే బీచ్లో మిస్సైన సాయిప్రియ.. పెళ్లిపీటలపై ప్రత్యక్షమైంది.. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకుంది.. తాళిబొట్టుతో ఉన్న ఫొటోను పేరెంట్స్కు పంపింది.. తల్లిదండ్రులకు వాట్సప్ ఆడియో మెస్సేజ్ పెట్టిన ఆమె.. తాను క్షేమంగానే వున్నాను… నాకోసం వెతకవోద్దని సమాచారం ఇచ్చింది. సాయిప్రియ ఆచూకీపై 48 గంటల పాటు ఉత్కంఠ కొనసాగగా.. ఆ మెసేజ్ రావడంతో అనుమానం నిజమైనట్టు చెబుతున్నారు. మొత్తంగా ఉద్దేశ్య పూర్వకంగానే సాయిప్రియ వెళ్లిపోయినట్టు నిర్ధారణకు వచ్చేశారు.
Read Also: Nara Lokesh: జగన్ దోపిడీని దశల వారీగా బయట పెడతాం.. క్లీన్ బౌల్డ్ తప్పదు..!
Also Read
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
కాగా, సాయిప్రియకు శ్రీనివాస్ అనే వ్యక్తితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్ఏడీ వద్ద ఓ కాలేజీలో సాయిప్రియ డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈనెల 25న తమ పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాస్, ఆయన భార్య సాయిప్రియ కలిసి విశాఖలోని ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలిసి ఉన్నారు. అయితే సాయి ప్రియ భర్తకు ఫోన్ లో మెసేజ్ రావడంతో ఒడ్డు నుంచి వెనక్కి వచ్చి మెసేజ్ చూసుకుని తిరిగి చూసేసరికి సాయి ప్రియ కనబడలేదు. దీంతో తన భార్య సముద్రంలోని కొట్టుకుపోయిందని భావించిన ఆమె భర్త శ్రీనివాస్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఆరోజే గత ఈతగాళ్ల సాయంతో బీచ్లో గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. ఇక, ఆ తర్వాత నేవీ హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది.. కానీ, సాయిప్రియ మాత్రం.. నెల్లూరులో సేఫ్గానే ఉంది.. ఇక, ఇప్పుడు నెల్లూరు నుంచి బెంగళూరుకు మకాం మార్చినట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!