YCP vs YCP: బెజవాడ మహిళల కొట్లాటలో కొత్త ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP vs YCP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో హై టెన్షన్ నెలకొంది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జి దేవినేని అవినాష్.. నిన్న తారకరామ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లారు. ఓ మహిళ ఇంటిపై టీడీపీ జెండా కనిపించడంతో.. ఎవరు పెట్టారని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆమె మమ్మల్ని స్థానిక కార్పొరేటర్ మోసం చేశారని.. అందుకే తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకున్నామని బదులిచ్చారు. ఇవాళ కూడా అదే ప్రాంతానికి వెళ్లిన వైసీపీ కార్యకర్తలు.. తమను ప్రశ్నించిన మహిళను నిలదీశారు. దీంతో టీడీపీ- వైసీపీ మహిళ కార్యకర్తల మధ్య గొడవ మొదలైంది. తెలుగు మహిళలపై వైసీపీ మహిళా కార్యకర్తలు మండిపడ్డారు. గడప గడపకు కార్యక్రమంలో.. ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గడప గడపకు కార్యక్రమంలో నిలదీసిందన్న కారణంతో.. తమ పార్టీకి చెందిన మహిళను కొట్టారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.
Read Also: Off The Record: వైసీపీలోనే ఉంటానంటారు.. వేడి రాజేస్తారు.. ఎమ్మెల్యేపై బంధువు ఒత్తిడి ఉందా?
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
మరోవైపు ఈ ఎపిసోడ్లో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి ట్విస్ట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వైసిపీ బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులు వైసీపికి చెందినవాళ్లని.. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు కార్యకర్తలను కొట్టారని మండిపడ్డారు. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే, బాధితులంతా వైసీపీకి చెందినవాళ్లే అన్నారు.. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టు వైసీపీ నేతలు కార్యకర్తలను కొట్టారని ఆరోపించారు.. చాలా విషయాలు మాట్లాడాలి.. కానీ, సొంత పార్టీ అవడం వల్ల మాట్లాడలేకపోతున్నానన్నారు.. సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తేనే కొడతారా..? అని నిలదీశారు.. కొట్టినవాళ్లలో ఆ డివిజన్ మహిళల కన్నా వేరే ప్రాంతం వాళ్లు ఉన్నారని.. ప్రశ్నించారు కాబట్టే కొట్టారని.. ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ప్రకటించారు.. దీంతో, ఈ వ్యహారం హాట్ టాపిక్గా మారిపోయింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!