ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు ఫ్యామిలీ ఓ నాయిబ్రాహ్మణుడికి అన్యాయం చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియాలో వస్తున్న నాయి బ్రాహ్మణుడికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అన్యాయం చేసిందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా నాగ శీనుపై కేసు పెట్టింది మోహన్ బాబు ఇంట్లో పనిచేస్తున్న నిక్కీ అనే మహిళ అని వెల్లడించారు.
నిక్కీ అనే మహిళకు సంబంధించిన హెయిర్ డ్రెస్సింగ్ వస్తువులను దొంగిలించారంటూ ఆమె కేసు పెట్టిందని, మోహన్ బాబు పై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. మోహన్ బాబు నాయి బ్రాహ్మణ కులస్తున్ని అవమానిచారంటు అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఆరోపించారు. నాగ శీను అనే వ్యక్తి నిక్కీ అనే మహిళతో సహజీవనం సాగిస్తూ ఆ మహిళను మోసం చేశాడని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు తెలిపారు.
Kodanda Ram : ప్రజా సమస్యలపై పోరాటంలో మా కార్యకర్తలు ముందున్నారు