Navy Day: విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు.. నౌకాదళ విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Day Celebrations At Vizag RK Beach: 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయ ఘట్టాన్ని పురస్కరించుకొని.. ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేసి.. లాంఛనంగా నేవీ డే విన్యాసాలను ప్రారంభించారు. భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్ను కూడా ఆమె ఆవిష్కరించారు.
తొలుత ఈ కార్యక్రమంలో భాగంగా నౌకాదళ సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సింధువీర్ సబ్మెరైన్ ద్వారా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేవీ డే విన్యాసాల్ని ప్రారంభించగా.. నేవీ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో విన్యాసాల్ని చేపట్టారు. చేతక్ హెలికాప్టర్లతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ.. గగనవిహారం చేశారు. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్లలోకి దిగగా.. ఆ బోట్లు వేగంగా తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా.. తీరంలో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ఈ ఆపరేషన్లో ప్రదర్శించారు. అంతేకాదు.. ఓ యుద్ధ నౌకలో కూడా మెరైన్ కమాండోలు విన్యాసాలు చేశారు.
Also Read
- AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.2 లక్షల కోట్లకు ఎస్ఐపీబీ ఆమోదం.. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు..
- TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు.. అభివృద్ధి పనులకు కోట్లు కేటాయింపు!
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Poleramma Jatara 2026: వెదురుపాకలో పోలేరమ్మతల్లి జాతర.. సందడి చేసిన దేవిశ్రీ ప్రసాద్!
నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలోకి దూసుకెళ్లడం, యుద్ధ విమానం నుంచి వెలువడిన కాంతిపుంజాలతో ఆకాశం వెలిగిపోవడం, యుద్ధ నౌకలతో పాటు సబ్మెరైన్ల నుంచి రాకెట్ ఫైరింగ్ చేపట్టడం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. ఏఎల్హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్బీ హెలికాప్టర్ల ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలైతే.. ఈ ఈవెంట్లోనే ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ విన్యాసాలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి విడదల రజని, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హాజరయ్యారు.
ఇదిలావుండగా.. 1971లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖ నేవీ స్థావరం కూడా కీలక పాత్ర పోషించింది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను నాశనం చేసేందుకు.. ఘాజీ అనే సబ్మెరైన్ని పాకిస్తాన్ పంపింది. అయితే.. అది లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే, విశాఖకు సమీపంలో ఘాజి సముద్ర జనాల్లో సమాధి అయ్యింది. ఆ విజయ ఘట్టాన్ని పురస్కరించుకొనే, ఈ నౌకాదళ విన్యాసాల్ని నిర్వహించడం జరుగుతోంది.
తాజావార్తలు
-
Heinrich Klaasen: ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న కాటేరమ్మ పెద్ద కొడుకు.. టాప్ 5లో ముగ్గురు హైదరాబాద్ ఆటగాళ్లే..
-
KING : షారూఖ్ ఖాన్ కింగ్ను వదలని లీక్స్.. నెట్టింట వైరల్ అవుతున్న రొమాంటిక్ సీన్
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక నుంచి రేషన్ షాపుల్లో అవి కూడా పంపిణీ..
-
SPIRIT : ప్రభాస్తో పెట్టుకుంటే ఇంతే సంగతులా? ‘స్పిరిట్’పై మాకు నమ్మకం లేదు?
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!