Nara Lokesh: దేశంలోనే అత్యధికంగా ఏపీలో ‘వ్యాట్’ బాదుడే బాదుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. రాష్ట్రంలో తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలోనే వ్యాట్ ట్యాక్స్ వసూలు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపించారు. ఇకనైనా వ్యాట్ తగ్గించి బాదుడే బాదుడిని ఆపాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై భారాలు తగ్గిస్తుంటే ఏపీలో ఒక్కసారి కూడా తగ్గించకుండా మరింతగా పన్నులు పెంచడం సమంజసం కాదన్నారు.
Pawan Kalyan: జగన్ సర్కార్ కూడా పెట్రోల్ రేట్లను తగ్గించాలి
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు తగ్గించి వాటి ధరలు తగ్గేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం అని లోకేష్ అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పాటు 23 రాష్ట్రాలు కూడా తాము విధించిన పన్నులను తగ్గించుకున్నట్లు గుర్తుచేశారు. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించి ఊరట కలిగిస్తున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించడానికి రూ.4 వ్యాట్ను రూ.2కి తగ్గించామన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే ఎక్కువగా పెట్రోల్పై 31 శాతం వ్యాట్ విధిస్తున్నారన్నారు. వ్యాట్కు తోడు రోడ్డు సెస్ అంటూ రూపాయి వసూలు చేసి దేశంలోనే ఎక్కువగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల పేరుతో సామాన్యులను దోచుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. ప్రభుత్వ దోపిడీ వల్ల రవాణా రంగంపై ఆధారపడిన అన్ని రంగాలూ తీవ్ర నష్టాల్లోకి వెళ్లాయన్నారు. పన్నుల రూపంలో పెట్రోల్, డీజిల్పై ప్రజలను దోచుకోవాలన్న జగన్ ప్రభుత్వం దురాశ కారణంగా నిత్యావసరాలు ధరలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్ మానవతా ధృక్పథంతో ఆలోచించి బాదుడే బాదుడుకి స్వస్తి చెప్పాలని లోకేష్ హితవు పలికారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!