Nara Lokesh: అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చండి.. జగన్కు డిమాండ్
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే మార్గం లేకుండా పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారని.. అన్నా క్యాంటీన్ల కోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని లేఖలో లోకేష్ గుర్తుచేశారు.
అయితే జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారని లోకేష్ విమర్శించారు. అన్నా క్యాంటీన్లను మూసేసే కుట్ర జరుగుతోందని తాము అడిగితే లేదని సమాధానం ఇచ్చిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే అన్నా క్యాంటీన్లను మూసివేసిందన్నారు. దీంతో ప్రభుత్వం రోజుకి 3 లక్షల మందికి ఆకలి మిగిల్చిందన్నారు. నిరుపయోగంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని లోకేష్ విమర్శించారు. కూలీలకు పనుల్లేవు.. కార్మికులకి ఉపాధి దొరకడంలేదు.. యాచకులు ఆకలితో నకనకలాడుతున్నారని.. పేదల ఆకలి తీర్చాలని టీడీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను నడుపుతున్నామని తెలిపారు. దాతల సాయంతో తాము నడుపుతోన్న అన్న క్యాంటీన్లకు వస్తోన్న పేదలను చూస్తోంటే ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు.ప్రభుత్వం పెట్టదు.. పెట్టేవాళ్లని అడ్డుకుంటుందని.. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే ధోరణి మంచిది కాదని లోకేష్ హితవు పలికారు. తాము పెడుతున్న అన్నా క్యాంటీన్లను కూల్చడం, అడ్డుకోవడం లాంటి పనులు ఇకనైనా ఆపాలని కోరుతున్నానని లేఖలో లోకేష్ తెలిపారు. నిధులు లేవు, అప్పులు దొరకడం లేదని మాత్రం సాకులు వెతకకుండా ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల కోసం జగన్ సర్కారు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ సీఎం జగన్ రెడ్డి గారికి లేఖ రాశాను.
పేదలపై కోపమో, అన్నగారి పేరు అంటే ద్వేషమో, ఆకలిజీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న క్యాంటీన్లని మూసేశారు.(1/3)#AnnaCanteen pic.twitter.com/l41uMDfgYf— Lokesh Nara (@naralokesh) June 25, 2022
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!