Nara Lokesh: అన్నా క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చండి.. జగన్కు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ ఏపీ సీఎం జగన్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అర్జెంటుగా తెరవాల్సిన అవసరం ఉందని లేఖలో లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నగారి పేరు మీద ద్వేషమో .. ఆకలి జీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్నా క్యాంటీన్లను మూసేశారని ఆరోపించారు.అన్న క్యాంటీన్లకు తాళాలు వేయడంతో పేదలు, కూలీలు, అభాగ్యుల ఆకలి తీర్చే మార్గం లేకుండా పోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారని.. అన్నా క్యాంటీన్ల కోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని లేఖలో లోకేష్ గుర్తుచేశారు.
అయితే జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారని లోకేష్ విమర్శించారు. అన్నా క్యాంటీన్లను మూసేసే కుట్ర జరుగుతోందని తాము అడిగితే లేదని సమాధానం ఇచ్చిన ప్రభుత్వం ఆ మరుసటి రోజే అన్నా క్యాంటీన్లను మూసివేసిందన్నారు. దీంతో ప్రభుత్వం రోజుకి 3 లక్షల మందికి ఆకలి మిగిల్చిందన్నారు. నిరుపయోగంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని లోకేష్ విమర్శించారు. కూలీలకు పనుల్లేవు.. కార్మికులకి ఉపాధి దొరకడంలేదు.. యాచకులు ఆకలితో నకనకలాడుతున్నారని.. పేదల ఆకలి తీర్చాలని టీడీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా కొన్ని ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను నడుపుతున్నామని తెలిపారు. దాతల సాయంతో తాము నడుపుతోన్న అన్న క్యాంటీన్లకు వస్తోన్న పేదలను చూస్తోంటే ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్నారు.ప్రభుత్వం పెట్టదు.. పెట్టేవాళ్లని అడ్డుకుంటుందని.. పేదవాళ్ల నోటి కాడ ముద్ద లాక్కునే ధోరణి మంచిది కాదని లోకేష్ హితవు పలికారు. తాము పెడుతున్న అన్నా క్యాంటీన్లను కూల్చడం, అడ్డుకోవడం లాంటి పనులు ఇకనైనా ఆపాలని కోరుతున్నానని లేఖలో లోకేష్ తెలిపారు. నిధులు లేవు, అప్పులు దొరకడం లేదని మాత్రం సాకులు వెతకకుండా ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ల కోసం జగన్ సర్కారు బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించి పేదల ఆకలి తీర్చాలంటూ సీఎం జగన్ రెడ్డి గారికి లేఖ రాశాను.
పేదలపై కోపమో, అన్నగారి పేరు అంటే ద్వేషమో, ఆకలిజీవులంటే అసహ్యమో తెలియదు కానీ అన్న క్యాంటీన్లని మూసేశారు.(1/3)#AnnaCanteen pic.twitter.com/l41uMDfgYf— Lokesh Nara (@naralokesh) June 25, 2022
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!