NTV Telugu Site icon

Srisailam Dam: మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తిన అధికారులు.. ఈ ఏడాది ఐదోసారి..

Srisailam

Srisailam

Srisailam Dam: కృష్ణా నదిలో మరోసారి వరద ఉధృతి పెరిగింది.. ఇప్పటికే జూరాలలో గేట్లు ఎత్తడంతో.. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది.. దీంతో.. శ్రీశైలం జలాశయం గేటును ఎత్తారు అధికారులు.. ఈ సంవత్సరంలో ఇది ఐదోవసారి రేడియల్ క్రెస్టు గేట్‌ ఎత్తడం విశేషంగా చెప్పుకోవాలి.. జలాశయం 1 రేడియల్ క్రెస్టు గేటు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో రూపంలో 93,270 క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం డ్యామ్‌లో చేరుతుండగా.. 1 గేటు 10 అడుగుల మేర ఎత్తి 95,626 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.. ఇక, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులుగా ఉంది.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం ప్రాజెక్టులో 212.9198 టీఎంసీలు నీరు నిల్వ ఉంచారు.. మరోవైపు.. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది..

Read Also: Putin Health Rumours: రష్యా అధ్యక్షుడికి అనారోగ్యమని ప్రచారం.. ఖండించిన క్రెమ్లిన్

ఇక, జూరాలకు వరద ఉదృతి కొనసాగుతోంది.. దీంతో 11 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 69,000 క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 78,503 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1044.849 ఫీట్లుగా ఉంది.. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు అయితే.. ప్రస్తుత నీటి నిల్వ 9.562 టీఎంసీలుగా ఉంది.. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రలలో 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.. ఎత్తి పోతల పథకాలకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్‌ అధికారులు..