Heavy Rain in Srisailam: శ్రీశైలంలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం.. బెంబేలెత్తిన భక్తులు, స్థానికులు
- శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి..
- క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా వర్షం..
- 4 గంటల పాటు భారీ వర్షంతో కొత్తపేట.. శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు..
- నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన బైక్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rain in Srisailam: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరిపిలేని కుంభవృష్టి కురిసింది.. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా 4 గంటల పాటు భారీ వర్షం పడింది.. వర్షం ధాటికి క్షేత్రంలోని కొత్తపేట, శ్రీగిరి కాలనీలో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు.. ఎగువన అటవీప్రాంతం నుండి నీరు ప్రవాహంలో బైక్లు కొట్టుకుపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇక, వర్షం నీరు ఇళ్లలోకి రావడంతో ఇంటి బయట జీపుల్లోనూ స్థానికులు గడపాల్సి వచ్చిందట.. లాలితంబికా షాపింగ్ కాంప్లెక్స్ లో కె,ఎల్ బ్లాక్ మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం ఉధృతంగా సాగింది.. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి బెంబేలెత్తిపోయారు శ్రీశైలం గ్రామస్థులు, భక్తులు, పర్యాటకులు..
Read Also: Siddipet Crime: చేర్యాలలో సైబర్ మోసం.. పోలీసుల పేరుతో 30 వేలు కాజేసిన కేటుగాళ్ళు
Also Read
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
మరోవైపు.. శ్రీశైలం జలాశయం వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చరియలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చరియలు విరిగి పెద్ద పెద్ద బండరాళ్లు తెలంగాణ, ఆంధ్రని కలిపే రహదారిపై పడ్డాయి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకు అడ్డంగా కొండ చరియలు విరిగిపడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కొండ చరియలు రాత్రి సమయానికి విరిగి పడడంతో రాత్రి వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. రోడ్డుపై పడ్డ కొండ చరియల బండరాళ్లను త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణ సమయంలో నీటి తుంపర్లు పడడంతో గతంలోనూ కొండ చర్యలు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి. అలానే వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ చర్యలు విరిగిపడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారుజ ఎన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో కొండ్ల చరియలు విరిగి పడి ట్రాఫిక్ జామ్ అయిన సంఘటనలు లేకపోలేదు. అయిన శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!