Nandigam Suresh: అమరావతి.. బినామీలతో ఆడిస్తున్న బాబు డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు.
అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన చెయ్యాలి.అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారు. హరగోపాల్, కోదండరాం ఢిల్లీలోని మేధా పాట్కరును కలిస్తే అమరావతి అసలు నిజాలు తెలుస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయనని జగన్ చెప్పలేదు.
Also Read
- Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
- NSTR Forest Entry Ban: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఆంక్షలు.. 3 నెలలు నో ఎంట్రీ..!
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.అమరావతి లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.గతంలో పేదలకు అండగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుఫు చంద్రబాబుకు అండగా ఉన్నామని చెప్తున్నారు.అమరావతిని నిలబెట్టుకునే కుయుక్తులు చంద్రబాబు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే చెప్తారు చంద్రబాబు పిలవగానే వచ్చిన హరగోపాల్,కోదండరాం కాదన్నారు ఎంపీ సురేష్.
చంద్రబాబు అమరావతిలో దళిత, బలహీన వర్గాల వారిని పట్టించుకోలేదు. శంకుస్థాపన రోజు బలహీన వర్గాల వారిని కనీసం పిలవలేదు. స్థానిక ఎమ్మెల్యే పేరు సైతం శిలాఫలకంపై లేదు. చంద్రబాబు తన బినామీలతో ఆడిస్తున్న డ్రామా అమరావతి ఉద్యమం అన్నారు. అది హరగోపాల్,కోదండరాం తెలుసుకోవాలి.మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.ఇతర ప్రాంతాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తాం.అమరావతి అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పారు.రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబు.ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజీపీ. అమరావతిని ఖూనీ చేసింది చంద్రబాబు, అమరావతి రైతుల ఏడ్పు చంద్రబాబుకు తగులుతుందన్నారు ఎంపీ సురేష్.
CPI Narayana: అమరావతిలో జగన్ పోటీ చేయాలి
తాజావార్తలు
-
UK Roads Melt at 40°C: 40°Cకే UK రోడ్లు కరుగుతుంటే.. 45°C దాటినా తట్టుకుంటున్న భారతీయ రోడ్లు.. ఆసక్తికరమైన కారణాలు
-
Varanasi : ‘వారణాసి’ వార్ సీన్స్.. మైండ్ బ్లోయింగ్ అంతే
-
Ayodhya: “వాష్రూమ్లలో డబ్బు దాచాం”.. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
-
Yadagirigutta: మెగా ఫ్యామిలీకి గుడ్ న్యూస్.. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డులో కొనిదెల సురేఖకు చోటు
-
Pithapuram Police: పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!