Nandigam Suresh: అమరావతి.. బినామీలతో ఆడిస్తున్న బాబు డ్రామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు.
అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన చెయ్యాలి.అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారు. హరగోపాల్, కోదండరాం ఢిల్లీలోని మేధా పాట్కరును కలిస్తే అమరావతి అసలు నిజాలు తెలుస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయనని జగన్ చెప్పలేదు.
Also Read
- YS Jagan: డీఎస్సీ నిరసనలపై దాడులు దారుణం.. Gen Z గొంతును మూయలేరు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.అమరావతి లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.గతంలో పేదలకు అండగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుఫు చంద్రబాబుకు అండగా ఉన్నామని చెప్తున్నారు.అమరావతిని నిలబెట్టుకునే కుయుక్తులు చంద్రబాబు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే చెప్తారు చంద్రబాబు పిలవగానే వచ్చిన హరగోపాల్,కోదండరాం కాదన్నారు ఎంపీ సురేష్.
చంద్రబాబు అమరావతిలో దళిత, బలహీన వర్గాల వారిని పట్టించుకోలేదు. శంకుస్థాపన రోజు బలహీన వర్గాల వారిని కనీసం పిలవలేదు. స్థానిక ఎమ్మెల్యే పేరు సైతం శిలాఫలకంపై లేదు. చంద్రబాబు తన బినామీలతో ఆడిస్తున్న డ్రామా అమరావతి ఉద్యమం అన్నారు. అది హరగోపాల్,కోదండరాం తెలుసుకోవాలి.మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.ఇతర ప్రాంతాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తాం.అమరావతి అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పారు.రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబు.ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజీపీ. అమరావతిని ఖూనీ చేసింది చంద్రబాబు, అమరావతి రైతుల ఏడ్పు చంద్రబాబుకు తగులుతుందన్నారు ఎంపీ సురేష్.
CPI Narayana: అమరావతిలో జగన్ పోటీ చేయాలి
తాజావార్తలు
-
Varuna Yagam: నాగార్జున సాగర్లో సీఎం రేవంత్ రెడ్డి వరుణ యాగం.. ముహూర్తం ఖరారు..
-
FCRA Bill: ‘మా చట్టాల గురించి మీకెందుకు?’.. అమెరికాకు భారత్ ఘాటు సమాధానం
-
Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
-
Jantar Mantar: జంతర్ మంతర్లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!