Nandigam Suresh: అమరావతి.. బినామీలతో ఆడిస్తున్న బాబు డ్రామా
అమరావతి విషయంలో మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేష్. అమరావతి ముసుగులో చంద్రబాబు బినామీలు 900 రోజుల కార్యక్రమం చేస్తున్నారు. హరగోపాల్, చంద్రబాబు లాండ్ పూలింగ్ ను వ్యతిరేకించిన వ్యక్తి. వాళ్ళు ఆహ్వానించగానే పోలోమని హరగోపాల్, కోదండరామ్ వచ్చారు.
అమరావతిలో రైతులకు ఎక్కడా అన్యాయం జరగలేదు.. చంద్రబాబు బినామీలకు మాత్రం అన్యాయం జరిగింది.చంద్రబాబు నడిపే అమరావతి తొమ్మిది వందల రోజుల కార్యమానికి హరగోపాల్, కోదండరాం హాజరు కావడంపై వాళ్లే ఆలోచన చెయ్యాలి.అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మభ్య పెడుతున్నారు. హరగోపాల్, కోదండరాం ఢిల్లీలోని మేధా పాట్కరును కలిస్తే అమరావతి అసలు నిజాలు తెలుస్తాయి. అమరావతిని అభివృద్ధి చేయనని జగన్ చెప్పలేదు.
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని జగన్ చెప్పారు.అమరావతి లో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.గతంలో పేదలకు అండగా ఉండే కమ్యూనిస్టులు ఇప్పుఫు చంద్రబాబుకు అండగా ఉన్నామని చెప్తున్నారు.అమరావతిని నిలబెట్టుకునే కుయుక్తులు చంద్రబాబు చేస్తున్నారు.జగన్ ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలే చెప్తారు చంద్రబాబు పిలవగానే వచ్చిన హరగోపాల్,కోదండరాం కాదన్నారు ఎంపీ సురేష్.
చంద్రబాబు అమరావతిలో దళిత, బలహీన వర్గాల వారిని పట్టించుకోలేదు. శంకుస్థాపన రోజు బలహీన వర్గాల వారిని కనీసం పిలవలేదు. స్థానిక ఎమ్మెల్యే పేరు సైతం శిలాఫలకంపై లేదు. చంద్రబాబు తన బినామీలతో ఆడిస్తున్న డ్రామా అమరావతి ఉద్యమం అన్నారు. అది హరగోపాల్,కోదండరాం తెలుసుకోవాలి.మూడు ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం.ఇతర ప్రాంతాలతో పాటు అమరావతిని అభివృద్ధి చేస్తాం.అమరావతి అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పింది, ముఖ్యమంత్రి కూడా చెప్పారు.రాష్ట్రానికి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబు.ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజీపీ. అమరావతిని ఖూనీ చేసింది చంద్రబాబు, అమరావతి రైతుల ఏడ్పు చంద్రబాబుకు తగులుతుందన్నారు ఎంపీ సురేష్.
CPI Narayana: అమరావతిలో జగన్ పోటీ చేయాలి
తాజావార్తలు
-
Top Selling CNG Cars: భారత్లో అత్యధికంగా సేల్ అయిన CNG కార్లు ఇవే..
-
IPL 2026 Playoffs Chances: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేస్.. గుజరాత్కు చిగురించిన ఆశలు, ఆ 5 టీమ్స్ ఇక ఇంటికేనా?
-
Jeffrey Epstein: ఎప్స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన ‘సూసైడ్ లేటర్’.. ప్రపంచ కుబేరులకు దడ!
-
TG DGP C.V. Anand: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్ బాధ్యతల స్వీకరణ..
-
Tandur: తాండూరులో చేతబడి కలకలం.. కూతురు ప్రేమ విఫలం కావాలని తల్లి క్షుద్రపూజలు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!