Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talliki Vandanam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత నిధుల జమ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా డబ్బులు జమ చేయనుంది. ఈ విడత ద్వారా 64,76,590 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
2026–27 విద్యా సంవత్సరానికి ఈ పథకం కింద ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులు, 42.70 లక్షల మంది తల్లులు, సంరక్షకులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ప్రకారం ఒక్కో విద్యార్థికి రూ.15 వేల ఆర్థిక సాయం మంజూరు చేయగా, అందులో రూ.2 వేలను నిర్దిష్ట నిబంధనల ప్రకారం మినహాయించి రూ.13 వేలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హత వివరాలు, లబ్ధిదారుల సమాచారం మన మిత్ర వాట్సాప్ సేవతో పాటు లీప్ (LEAP) యాప్ ద్వారా కూడా సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
మరోవైపు, అంగన్వాడీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం విదితమే.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు బాసటగా నిలిచే ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని రకాల అంగన్వాడీ టీచర్లు, ఆయాల పిల్లలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, అంగన్వాడీలతో పాటు శానిటేషన్ వర్కర్ల పిల్లలను కూడా ఈ పథకం పరిధిలోకి తెస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ విద్యాసంవత్సరానికి సంబంధించిన ‘తల్లికి వందనం’ నిధులను ఇవాళ విడుదల చేస్తోంది ప్రభుత్వం.. ఇందుకోసం ఇప్పటికే రూ.10,120.78 కోట్లను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 1 నుంచి 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15,000 చొప్పున ఈ ఆర్థికసాయం జమ కానుంది. ఇందులో రూ.13,000 నేరుగా తల్లి ఖాతాకు, రూ.2,000 పాఠశాల నిర్వహణకు కేటాయిస్తారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!