Nadendla Manohar : సమస్యలపై రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చు
- రైతుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్
- ధాన్యం కొనుగోలు ఫిర్యాదులకు 1967 హెల్ప్లైన్
- రాష్ట్రవ్యాప్తంగా రూ.2,830 కోట్లు చెల్లింపు
- ఫిర్యాదులపై పూర్తి ఫాలోఅప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar : ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటి వరకు రూ. 2,830 కోట్లు జమ చేసినట్లు ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.రైతులు ధాన్యం విక్రయ ప్రక్రియలో ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు.. విజయవాడ కానూరు సివిల్ సప్లై భవన్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు.
ధాన్యం కొనుగోలు సంబంధిత ఫిర్యాదుల కోసం 1967 టోల్ ఫ్రీ హెల్ప్లైన్ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.ఈ హెల్ప్లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తుంది. ధాన్యం రిజిస్ట్రేషన్ సమస్యలు, టోకెన్ ఆలస్యం, ఆర్ఎస్కే/మిల్లులో తూకం సమస్యలు, ఎఫ్టిఒ పెండింగ్, రవాణా, గోనె సంచుల కొరత, లేదా ఏదైనా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడం వంటి సమస్యలపై, రైతులు నేరుగా 1967కు కాల్ చేయొచ్చని మంత్రి స్పష్టం చేశారు.
Also Read
- Illegal Ration Rice: అక్రమ రేషన్ బియ్యం మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం.. 2 వేల కేజీల బియ్యం స్వాధీనం!
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
కాల్ చేసేముందు రైతులు ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, టోకెన్ నెంబర్, గ్రామం పేరు, ఆర్ఎస్కే… ఈ వివరాలు సిద్ధంగా పెట్టుకోవాలని సూచించారు.. కంట్రోల్ రూమ్లో ఫిర్యాదు నమోదు చేసి… సంబంధిత అధికారులకు పంపబడుతుందని, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అధికారులు ఫాలోఅప్ చేస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై అధికారులు, మండలాల వారీగా రైతులు, రైస్ మిల్లర్లు, ఆర్ఎస్కే నిర్వాహకులను సంప్రదించి… ధాన్యం కొనుగోలు సమస్యలను తెలుసుకుని వెంటనే సూచనలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
-
Bhojshala case: “భోజ్శాల ఒక దేవాలయం”.. మందిర్-మసీదు కేసులో హైకోర్టు సంచలన తీర్పు..
-
Keralam: మాజీ సీఎం విజయన్ను కలిసిన సతీశన్.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చ
-
Film Chamber Meeting : ‘పెద్ది’ సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!