Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే మా నినాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Interesting Comments On Chandrababu Pawan Kalyan Meeting: జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేదే తమ విధానం, నినాదమని పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు. నిన్న చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు. భవిష్యత్లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లా & ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని అన్నారు. తాను ఎక్కడ కాపురం పెడితే, అక్కడి నుంచే పరిపాలన అనే అభిప్రాయం కల్పించేలా సీఎం వ్యాఖ్యానించడం విచిత్రంగా ఉందని విమర్శించారు. వైసీపీ వ్యతిరేకులంతా ఒకే తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Gas leak : లూథియానాలో గ్యాస్ లీక్.. తొమ్మది మంది మృతి
Also Read
- AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
- Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
- YS Jagan Kurnool Tour: కర్నూలులో నేడు జగన్ పర్యటన.. పోలీసుల అనుమతి.. షరతులు ఇవే..!
- OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
అంతకుముందు పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలోనూ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అని పేర్కొన్న ఆయన.. ఈ ప్రాజెక్టుని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపణలు చేశారు. 45.72 మీటర్లు ఎత్తు ఉండాల్సిన పోలవరం ప్రాజెక్టును.. మొదటి దశలో 41.15కు పూర్తి చేస్తామని అనడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయితే.. ప్రాజెక్టు మరమత్తు కోసం రూ.2,030 కోట్ల పోలవరం అధారిటీ నుంచి సాంక్షన్ రాకపోయినా, జీవో విడుదల చేయడం అవినీతి కాదా? అంటూ నిలదీశారు. పోలవరం పూర్తైపోతుందని మభ్యపెట్టడాన్ని ఖండించాలన్నారు. లక్ష కుటుంబాలు నిర్వాసితులైతే.. ప్రభుత్వం కేవలం 24 వేల కుటుంబాలకు మాత్రమే రూ.10 లక్షలు చొప్పున ఇచ్చి, చేతులు దులుపుకుందామని చూస్తోందని మండిపడ్డారు.
Kadapa Crime: ఇంటర్ ఫెయిలైన కూతురు.. అవమానంతో తల్లి ఏం చేసిందంటే?
తాజావార్తలు
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?