Childrens Mysterious Deaths: పసిపిల్లల ప్రాణాల్ని మింగేస్తున్న వింత వ్యాధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ గ్రామంపై మృత్యువు పగబట్టింది. పసికందుల ప్రాణాలను తోడేస్తోంది. మూడేళ్ళుగా వరుస మరణాలు నమోదవుతున్నాయి. చిన్నారుల అకాల చావులకు కారణాలు అం తుబట్టక జనం ఊరు వదిలిపోతున్నారు. దీంతో వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రూఢకోటలో ఏం జరుగుతోంది? ఈ మిస్టరీ మరణాల వెనుక వున్న అంతుచిక్కని రహస్యం ఏంటి? రూఢకోట….ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని గిరిజన గ్రామం. పెదబయలు మండల కేంద్రానికి సుమారు 50కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఒకప్పుడు మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. దీంతో సహజంగానే అభివృద్ధి, సంక్షేమం ఆలస్యంగా రూఢకోటకు చేరాయి. ఈ క్రమంలోనే ఇక్కడ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండెకోత వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ ఏటా పదుల సంఖ్యలో శిశుమరణాలు నమోదవుతున్నాయి. అంతుబట్టని కారణాలతో పిల్లలు అర్ధాయుష్షుతో చనిపోతున్నారు. సమస్య తీవ్రత గవర్నర్ కు చేరడంతో ఆయన స్పందించి తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. మళ్ళీ ఏడాది తిరిగింది. గ్రామంలో పిల్లల చావులు మొదలయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు ముగ్గురు మృత్యు వాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూఢకోట గ్రామంలో రెండేళ్ళుగా సంభవిస్తున్న మరణాలు మిష్టరీగా కనిపిస్తున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారుల అంతు చిక్కని అనారోగ్య సమస్యతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడా ది మళ్ళీ పిల్లల మరణాలు నమోదవ్వడంతో జాతీయ గిరిజన సంఘం రూఢ కోటలో పర్యటించింది. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2018 నుండి 2022 వ
రకు 22 మంది చిన్నారులు మృత్యువాతపడినట్టు నిర్ధారించుకుంది.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మరో ట్రాజడీ ఏంటంటే మరణాలు అన్నీ దాదాపుగా ఒకే వీధిలో సంభవిస్తున్నవే కావడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. 11కుటుంబాల్లో విషాధం చోటు చేసుకోగా ఒక్కో ఇంటి నుంచి ముగ్గురేసి చొప్పున మరణించడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. గత ఏడాది రూఢకోటలో మరణాలపై ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించి విచారించింది. తల్లిపాలు ఎక్కువగా తాగడం కారణంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి చనిపోతున్నారనే అభిప్రాయం కలిగించడం సరైంది కాదంటున్నారు గ్రామస్ధులు.
గత ఏడాది రూఢకోట ఆవేదన బాహ్య ప్రపంచం వెలుగు చూసినప్పుడు తక్షణ రక్షిత మం చినీటి ప్రాజెక్ట్ చేపడతామని యంత్రాంగం హామీ ఇచ్చింది. కోటిముప్పై లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ మంమంజూరు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో పిల్లలు వున్న తల్లిదండ్రులు గ్రామం వదిలిపోతున్నారు. ఇక్కడ వుంటే మరణం తప్పదనే భయం వాళ్ళను వెంటాడుతోంది. రూఢ కోట మరణాల వెనుక మిష్టరీని చేధించడంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటేషన్ పద్ధతులపై అవగాహనకల్పించాలని, ఆ దిశగా ప్రత్యేక మెడికల్ క్యాంప్ లు పెట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!