Childrens Mysterious Deaths: పసిపిల్లల ప్రాణాల్ని మింగేస్తున్న వింత వ్యాధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ గ్రామంపై మృత్యువు పగబట్టింది. పసికందుల ప్రాణాలను తోడేస్తోంది. మూడేళ్ళుగా వరుస మరణాలు నమోదవుతున్నాయి. చిన్నారుల అకాల చావులకు కారణాలు అం తుబట్టక జనం ఊరు వదిలిపోతున్నారు. దీంతో వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రూఢకోటలో ఏం జరుగుతోంది? ఈ మిస్టరీ మరణాల వెనుక వున్న అంతుచిక్కని రహస్యం ఏంటి? రూఢకోట….ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లోని గిరిజన గ్రామం. పెదబయలు మండల కేంద్రానికి సుమారు 50కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఒకప్పుడు మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం. దీంతో సహజంగానే అభివృద్ధి, సంక్షేమం ఆలస్యంగా రూఢకోటకు చేరాయి. ఈ క్రమంలోనే ఇక్కడ తల్లిదండ్రులు అనుభవిస్తున్న గుండెకోత వెలుగులోకి వచ్చింది.
ఇక్కడ ఏటా పదుల సంఖ్యలో శిశుమరణాలు నమోదవుతున్నాయి. అంతుబట్టని కారణాలతో పిల్లలు అర్ధాయుష్షుతో చనిపోతున్నారు. సమస్య తీవ్రత గవర్నర్ కు చేరడంతో ఆయన స్పందించి తక్షణ సహాయ చర్యలకు ఆదేశించారు. మళ్ళీ ఏడాది తిరిగింది. గ్రామంలో పిల్లల చావులు మొదలయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు ముగ్గురు మృత్యు వాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం రూఢకోట గ్రామంలో రెండేళ్ళుగా సంభవిస్తున్న మరణాలు మిష్టరీగా కనిపిస్తున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 4 ఏళ్ల లోపు చిన్నారుల అంతు చిక్కని అనారోగ్య సమస్యతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ ఏడా ది మళ్ళీ పిల్లల మరణాలు నమోదవ్వడంతో జాతీయ గిరిజన సంఘం రూఢ కోటలో పర్యటించింది. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం ఆధారంగా 2018 నుండి 2022 వ
రకు 22 మంది చిన్నారులు మృత్యువాతపడినట్టు నిర్ధారించుకుంది.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
ఇక్కడ మరో ట్రాజడీ ఏంటంటే మరణాలు అన్నీ దాదాపుగా ఒకే వీధిలో సంభవిస్తున్నవే కావడంతో తల్లిదండ్రులు భయపడుతున్నారు. 11కుటుంబాల్లో విషాధం చోటు చేసుకోగా ఒక్కో ఇంటి నుంచి ముగ్గురేసి చొప్పున మరణించడంతో ఆందోళనలు నెలకొంటున్నాయి. గత ఏడాది రూఢకోటలో మరణాలపై ప్రభుత్వం వైద్యుల కమిటీని నియమించి విచారించింది. తల్లిపాలు ఎక్కువగా తాగడం కారణంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి చనిపోతున్నారనే అభిప్రాయం కలిగించడం సరైంది కాదంటున్నారు గ్రామస్ధులు.
గత ఏడాది రూఢకోట ఆవేదన బాహ్య ప్రపంచం వెలుగు చూసినప్పుడు తక్షణ రక్షిత మం చినీటి ప్రాజెక్ట్ చేపడతామని యంత్రాంగం హామీ ఇచ్చింది. కోటిముప్పై లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ మంమంజూరు చేస్తామని చెప్పినప్పటికీ ఆచరణలోకి రాలేదనేది ఆరోపణ. ఈ నేపథ్యంలో పిల్లలు వున్న తల్లిదండ్రులు గ్రామం వదిలిపోతున్నారు. ఇక్కడ వుంటే మరణం తప్పదనే భయం వాళ్ళను వెంటాడుతోంది. రూఢ కోట మరణాల వెనుక మిష్టరీని చేధించడంతో పాటు గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శానిటేషన్ పద్ధతులపై అవగాహనకల్పించాలని, ఆ దిశగా ప్రత్యేక మెడికల్ క్యాంప్ లు పెట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: మళ్ళీ స్టైలిష్ లుక్’లోకి పవన్ కళ్యాణ్
-
TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
-
Peddi: ‘పెద్ది’ ట్రైలర్లో.. సమంతను గుర్తు చేస్తున్న జాన్వీ
-
Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
-
Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!