Tirumala: తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేసిన ముస్లిం దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim Couple Donation in Tirumala: తిరుమల శ్రీవారి ఖాతాలో భారీ ఎత్తున విరాళాలు చేరుతున్నాయి. ఇటీవల రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాజాగా చెన్నైకు చెందిన ముస్లిం దంపతులు రూ.1.02 కోట్ల భారీ విరాళాన్ని టీటీడీకి అందజేశారు. ముస్లిం దంపతులు సుబీనా బాను, అబ్దుల్ ఘనీ తిరుమల కొండపై శ్రీవారిని దర్శించుకుని అనంతరం ఈ విరాళాన్ని అందించారు. ముస్లిం దంపతులు విరాళం తాలూకు చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకులు మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. కాగా ఈ దంపతులు తాము సమర్పించిన విరాళంలో రూ.87 లక్షలను ఇటీవల తిరుమలలో ఆధునికీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు, మిగతా రూ.15 లక్షలను ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు ఉపయోగించాలని టీటీడీని కోరారు.
గుడిలో వివాహం చేసుకున్న ముస్లిం జంట
18 ఏళ్ల క్రితం వివాహం జరిగి 9 మంది సంతానం ఉన్న ఓ ముస్లిం జంట హిందూ సంప్రదాయం ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకోవడం తాజాగా హాట్ టాపిక్గా మారింది. అమెరికాకు చెందిన కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫా 18 ఏళ్ల తర్వాత యూపీలోని జౌన్పూర్ త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయ పూజారి రవిశంకర్ గిరి మళ్లీ పెళ్లి చేశారు. ముస్లిం దంపతులు హిందూ ఆచారాల ప్రకారం అగ్నిని సాక్షిగా భావించి త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేశారు. ముస్లిం దంపతులు భారతదేశ పర్యటనలో భాగంగా వారణాసి ఘాట్లు, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించిన సమయంలో హిందూ సంస్కృతి పట్ల ఆకర్షితులయ్యారు. దీంతో వారు హిందూ ఆచారాల ప్రకారం మళ్లీ వివాహం చేసుకోవాలని భావించి భగవంతుని సన్నిధిలో పెళ్లి చేసుకున్నారు. కాగా తన తాత భారతీయ సంతతికి చెందిన హిందువు అని కేషా ఖలీఫా పేర్కొన్నారు.
Also Read
- BC Reservation Bill: 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ఏపీ అసెంబ్లీలో బిల్లు.. మంత్రి సవిత కీలక ప్రకటన
- BC reservations: బీసీలకు 34శాతం రిజర్వేషన్లు.. స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు ప్రకటన..
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- AP Cabinet Decisions 2026: బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. 34 శాతం అమలుకు గ్రీన్ సిగ్నల్!

తాజావార్తలు
-
Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
-
Congress: ‘RSS, జైష్, తాలిబన్ మధ్య తేడా లేదు’.. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
-
CM Revanth Reddy UK, USA Tour: సీఎం రేవంత్ విదేశీ పర్యటన.. కీలక భేటీలు.. ఆగస్టు 20 నుంచి 30 వరకు పూర్తి షెడ్యూల్
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!