Margani Bharat: పవన్కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Margani Bharat Challenges Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా.. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఒక ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీతో సై అంటే సై అని ఆయన ఓంపెన్ ఛాలెంజ్ చేశారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. సై అంటే సై దేనికి? ఏపిలో 175 సీట్లకు పోటీ చేస్తారా? అని డిమాండ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పోటీకి వైసీపీ ‘సై అంటే సై’ అని సవాల్ చేశారు. పవన్ ఒక సినిమా స్టార్ కాబట్టి, ఆయన సభలకు యువత వస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ.. సీఎం జగన్ ఒక పొలిటికల్ స్టార్ అని, అందుకే ఆయనకు ప్రజాభిమానం ఉందని తెలిపారు. పవన్ కేవలం గోదావరి జిల్లాల్లోనే పోటీ చేస్తారా? ఆ జిల్లాలకే పరిమితమా? అని ప్రశ్నించారు. వైసీపీని ఓడించాలని, పవన్కి ఎందుకంత కక్ష అని నిలదీశారు. చంద్రబాబు అవినీతి పాలన అందిస్తే, జగన్ మెరుగైన పాలన అందించారని.. చంద్రబాబుకు, జగన్కు తేడా గ్రహించాలని ప్రజల్ని సూచించారు.
Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..
Also Read
- Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
- Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణకు శ్రీకారం.. 117 కొత్త గేట్ల పనులు ప్రారంభించిన సీఎం!
- APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
అంతకుముందు కూడా.. సీఎం జగన్ పేరు తలరుచుకుంటేనే కొంతమందికి బీపీ వస్తుందని మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. ఇక్కడ బీపీ అంటే.. చంద్రబాబు, పవన్ అని అభివర్ణించారు. పవన్కి నిర్దిష్టమైన ఆలోచన లేదని.. రాష్ట్రాభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ గాడిదలు కాశారా? అని మండిపడ్డారు. కనీసం ఓటు హక్కు కూడా ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారని తూర్పారపట్టారు. పవన్ సభలకు వచ్చే అల్లరిమూకల్ని చూసి.. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. దత్తపుత్రుడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుంచి సీఎం జగన్ వందశాతం నిధులు సాధిస్తున్నారని.. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎక్కువ సీట్ల సంఖ్య వైసీపీకి వస్తే, ప్రత్యేక హోదా కూడా లభిస్తుందని పేర్కొన్నారు.
Ee Nagaraniki Emaindi: గ్యాంగ్స్ తో వచ్చి రచ్చ చేస్తున్నారు మైక్…
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!