MP Kesineni: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. పార్టీలతో నాకు పని లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Kesineni: టీడీపీ సీనియర్ నేత, బెజవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్నికల్లో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీలతో నాకు పని లేదు.. ప్రజలు కోరుకుంటే నన్ను ఇండిపెండెంటుగా గెలిపిస్తారు.. చంద్రబాబు టిక్కెట్ ఇవ్వకుంటే ఏమవుతుంది..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని నేనెక్కడా చెప్పలేదన్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీని నిండు సభలో వ్యతిరేకించా.. అయినా బెజవాడలో పనులు ఆగాయా..? దటీజ్ కేశినేని నాని అంటూ వ్యాఖ్యలు చేశారు.. నన్ను.. నా పర్సనాల్టీని డీగ్రేడ్ చేయాలని చూడొద్దు.. నన్ను డీ-గ్రేడ్ చేయాలని చూస్తే.. అంతగా నా పర్సనాల్టీని పెరుగుతుందన్నారు. 2013కు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ ఉండేవి.. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకంతో నేను టీడీపీలో చేరాను.. నేను 2013లో టీడీపీలో చేరాకే వైసీపీలోకి వలసలు ఆగాయని చెప్పుకొచ్చారు.
Read Also: California Shooting: కాలిఫోర్నియాలో కాల్పులు.. 6 నెలల పాపతో సహా ఆరుగురు మృతి
Also Read
- YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
- CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
- AP Weather Update: భిన్న వాతావరణం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఆ జిల్లాల్లో వడగాలులు..
- CM Chandrababu: కాగితాలు తీసుకుని కార్లో వదిలిపెట్టొద్దు, పరిష్కారం చూపండి.. కలెక్టర్లకు సీఎం ఆదేశాలు!
టాటా ట్రస్టుతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని తెలిపారు ఎంపీ కేశినేని నాని.. వంద చీరలు పంచి.. పది ట్రై సైకిళ్లు పంచి కొందరు దాన కర్ణుడులాగా కలర్ ఇస్తున్నారని.. ఈ దాన కర్ణుల చరిత్రేంటో..? ఎక్కడి నుంచి ఊడిపడ్డారో చరిత్ర చూడండి.. ఎన్నికలనగానే వస్తారు.. ఫౌండేషన్ అంటారు.. సేవా కార్యక్రమాలంటారు.. వీరికి డబ్బులెక్కడి నుంచి వచ్చాయో ఇన్వెస్టిగేట్ చేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పేదొళ్లకు డబ్బులిస్తారు.. జిందాబాద్ లు.. జైజైలు కొట్టించుకుంటారు.. ఇదేనా రాజకీయం అంటూ నిలదీశారు. ఓ చిన్న మాట కోసం నా వ్యాపారాలు వదిలేసుకున్నా అని గుర్తుచేసుకున్నారు.. ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, సెంట్రల్ ఇండియాను బస్సుల వ్యాపారంలో నేను కింగ్ అని.. ఎంపీగా మాట్లాడుతున్నారా..? ఆపరేటరుగా మాట్లాడుతున్నారా..? అన్నందుకు నేను వ్యాపారం వదిలేసుకున్నాను అన్నారు.. లోఫర్లు.. ల్యాండ్ గ్రాబర్లు వచ్చి ఏదో చేస్తే.. ప్రొజెక్షన్ ఇస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేశినేని నాని.. అయితే, బెజవాడ ఎంపీ చేసిన తాజా కామెంట్లు మరోసారి టీడీపీలో కాకరేపుతున్నాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!