GVL Narsimha Rao: తెలుగు రాష్ట్రాలపై ఇక ప్రత్యేక దృష్టి
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశాలకోసం మోడీ ,అమిత్ షా హైదరాబాద్ రానున్నారన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు..అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న బిజేపి ఎంపి జివి ఏల్ నరసింహారావు. నాలుగవ తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మోడి పర్యటించి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు బీజేపి ఏస్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో మోడీ పర్యటనల వల్లే అర్దమౌతున్నాయన్నారు జీవీఎల్. తెలుగు రాష్ట్రాల పై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రతీ పోలింగ్ బూత్ లో బీజేపీ బలంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
అత్యంత వెనుక పడిన జిల్లాలుగా శ్రీకాకుళం , విజయనగరం ,విశాఖ ఉన్నాయి. ప్రకృతి వనరులు , నీటి వనరులు ఉన్నప్పటికి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా వెనుక బడిన ప్రాంతాలుగానే ఉండిపోయాయని విమర్శించారు జీవీఎల్. సరైన అభివృద్ధి లేకపోవడం వల్లే రైతులు , మత్స్యకారులు వలస పోతున్నారు. జల దీక్ష వంటి మా పోరాటం తరువాతనే ప్రభుత్వం వంశధారపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయం అందేలా కృషి చేస్తాం అన్నారు.
Also Read
అగ్నిపథ్ పథకం ప్రభుత్వ నిర్ణయం కాదు ..సైనిక దళాలే నిర్ణయం తీసుకున్నాయి. దేశ సైనిక బలంలో యువతరాన్ని నింపేలా అగ్నిపథ్ ద్వారా సాధ్యం అవుతుందన్నారు. అగ్నిపథ్ ద్వారా వేలాది మందిని రిక్యూట్ చేస్తుకుంటాం అన్నారు జీవీఎల్. ఈ పథకం కోసం భారీగా దరఖాస్తులు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!