ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి..పెరగనున్న వైసీపీ బలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా వ్యాప్తి కారణంగా ఎన్నికలను వాయిదా వస్తూ వచ్చింది. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబరు 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
నవంబరు 19న పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ఏపీలో మే 31న ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఏపీ అసెంబ్లీలో వైసీపీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉండడంతో మూడుస్థానాలు ఆ పార్టీకి దక్కనున్నాయి. ప్రస్తుత మండలిలో 14 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు…స్థానిక సంస్థల కోటాలో 11 మందిని భర్తీ చేయాలి. అందులో తాజాగా ఎన్నికల సంఘం ఎమ్మెల్యే కోటాలో ముగ్గురి నియామకానికి షెడ్యూల్ విడుదల చేసింది.
Also Read
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
అందులో వైసీపీ నుంచి డీసీ గోవిందరెడ్డి..టీడీపీ నుంచి మాజీ ఛైర్మన్ మహమ్మద్ షరీఫ్…బీజేపీ నుంచి సోము వీర్రాజు పదవీ విరమణ చేసారు. స్థానిక సంస్థల కోటాలో 11 మందికి సంబంధించిన లిస్టు కూడా వైసీపీ అధినాయకత్వం సిద్దం చేసిందని తెలుస్తోంది. ఈ 14 మంది వైసీపీ నుంచి సభలో ఎంట్రీ ఇస్తే.. మొత్తం 58 మంది సభ్యులు ఉన్న ఏపీ శాసన మండలిలో 32 స్థానాల తో వైసీపీ అటు శాసన సభలో..శాసన మండలిలో పూర్తి మెజార్టీతో నిలుస్తుంది.
ఇప్పటికే మండలి ఛైర్మన్..డిప్యూటీ ఛైర్మన్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఈ ఎన్నికల తరువాత ఈ రెండు పోస్టులను భర్తీ చేయనున్నారు. రెండు స్థానాలు వైసీపీ వశం కానున్నాయి. మండలిలో బలం పెరిగితే జగన్ ప్రభుత్వానికి ఏ బిల్లుల విషయంలోనైనా తిరుగులేదంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పదవులు దక్కనివారికి పదవులు లభించే అవకాశం వుందంటున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!