Botsa Satyanarayana: విశాఖ స్టీల్ప్లాంట్కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై అనుమానాలున్నాయి..
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయి- బొత్స సత్యనారాయణ
- స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నా యి- బొత్స
- ప్రైవేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజ్- బొత్స సత్యనారాయణ
- అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుంది..?- బొత్స.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్పై వైసీపీకి చాలా అనుమానాలు ఉన్నాయని సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. స్టీల్ ప్లాంట్ ముసుగులో కూటమి పార్టీలు గుద్దులాడుతున్నాయని ఆరోపించారు. ప్రయివేటీకరణ వ్యూహం అమలులో భాగంగానే ప్యాకేజ్ అనేది ఖచ్చితంగా చెబుతున్నాం.. అప్పులు తీర్చుకోవడానికి డబ్బులు ఇస్తే పరిశ్రమ ఏ విధంగా నడుస్తుంది..? అని ప్రశ్నించారు. కార్యచరణ ప్రకటించకుండా ప్యాకేజ్ ప్రకటించడం వెనుక మతలబు ఉందని అన్నారు. ప్యాకేజ్ అనేది ప్రలోభ పెట్టడమే తప్ప ప్రయోజనం చేకూర్చేది కాదని తెలిపారు.
Read Also: Side Effects of Antibiotics: గుండె రోగులకు యాంటీబయాటిక్స్ సరైనవేనా?
Also Read
ప్రయివేటీకరణ ఆలోచన కేంద్రానికి లేకపోతే ప్రధాని సభలో కానీ అమిత్ షా టూర్ లో ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్సీ బొత్ససత్యనారాయణ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డుపడటం వల్లే ప్రయివేటీకరణకు కేంద్రం సాహసం చేయలేదని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో పోరాటం చేస్తాం.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉండాలనేది తమ విధానం అందుకోసం తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. దివాళా తీసే స్థితిలో ఉన్న పరిశ్రమకు ప్యాకేజ్ ఇవ్వడం ద్వారా ఎటువంటి మేలు జరగదని అన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆర్భాటం, ప్రచార యావ తప్ప ప్రజారక్షణ పై బాధ్యత లేదనేది అర్ధం అవుతూందని పేర్కొన్నారు.
Read Also: Trump Trip To India: భారత పర్యటనపై ట్రంప్ ఆసక్తి.. సలహాదారులతో చర్చ..
తిరుపతి ఘటనపై కేంద్రం విచారణ జరక్కుండా అడ్డుకుని పరువు కాపాడుకున్నామని ప్రభుత్వం భావిస్తోందని బొత్స సత్యనారాయణ తెలిపారు. దురదృష్టకర సంఘటనలు జరక్కుండా చూసుకున్నప్పుడు మాత్రమే పరువు నిలబడుతుంది.. తిరుపతి ఘటనపై న్యాయ విచారణ కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ రాశానని చెప్పారు. సుమోటోగా తీసుకుని జ్యుడీషియల్ విచారణ జరిపించమని విజ్ఞప్తి చేశానన్నారు. అమిత్ షా టూర్ లో రాష్ట్రానికి జరిగే మేలు గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గురించి చర్చించడం దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. ఋషికొండ భవనాలు ముమ్మాటికీ ప్రభుత్వ ఆస్తే.. అవకతవకలు ఉంటే విచారించుకోవచ్చన్నారు. మరోవైపు.. ఫీజు రీ ఎంబర్స్మెంట్ కోసం ఈనెల 29 వరకు చూస్తాం.. ప్రభుత్వం ఇవ్వకపోతే ఆందోళన చేస్తామని అన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!