మొన్న కబడ్డీ… నేడు త్రో బాల్ ఆడిన ఎమ్మెల్యే రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకవైపు రాజకీయాలు, మరోవైపు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ బాధ్యతలు. జబర్దస్త్ జ్యూరీ క్షణం కూడా తీరిక లేని రోజా క్రీడల్లోని పాల్గొని అభిమానులను, నియోజకవర్గ ప్రజలను ఉత్సాహ పరుస్తూ వుంటారు. గతంలో కబడ్డీ ఆడిన రోజా తన భర్తకే చుక్కలు చూపించారు. ఆయన్ని ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే.
ALSO READ: ఎమ్మెల్యే రోజా కబడ్డీ .. కబడ్డీ
Also Read
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
- Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో మంచి విధానాలతో ప్రతి విషయంలో ముందడుగు వేయాలన్నారు రోజా. దీని ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వివిధ మండలాల్లో త్రోబాల్ ఆడిన క్రీడాకారులు ఫైనల్స్ కి చేరుకుని నగరిలో ఆడటం శుభపరిణామం అన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఆడటం దీని ద్వారా కొత్త పరిచయం ఏర్పడుతుందని రోజా అన్నారు. నగరిలో నేడు త్రో బాల్ ఫైనల్స్ ఆట ప్రారంభం సందర్భంగా రోజా మాట్లాడారు.
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రోజా ట్రస్ట్ తరఫున ఒకటో తారీకు నుంచి 16 వ తారీఖు వరకు నగరి డిగ్రీ కళాశాల యన్.టి.ఆర్. క్రీడా మైదానంలో గ్రామీణ క్రీడా సంబరాలు -2021 జరిగాయి. ఈ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా త్రో బాల్ ఫైనల్స్ సందర్భంగా యువకులను ఉత్సాహపరుస్తూ త్రో బాల్ ఆటను ఆడి ప్రారంభించారు. రోజా క్రీడాకారులతో కలిసి త్రో బాల్ ఆడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎక్కడ ఏ క్రీడా సంబరాలు జరిగినా రోజా పాల్గొంటూ వుంటారు. విద్యార్థులందరినీ ఉత్సాహపరిచే వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నగరి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడమే ముఖ్య లక్ష్యమని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని పెంపొందించే క్రీడలు ఆడటం వలన మైండ్ సెట్ మారుతుందన్నారు.
శారీరక పరంగా ఉత్తేజాన్ని కలిగించి దృఢమైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థాయి కలుగుతుందన్నారు రోజా. విద్యార్ధులు చిన్న చిన్న విషయాలకు మానసికస్థితి కోల్పోతున్నారని ఆవేదన చెందారు. తమ మానసిక స్థితిని క్రీడలు ఆడటం వలన క్రియాశీలకంగా ఆలోచించే స్థాయికి ఎదుగుదల వస్తుందని రోజా అన్నారు. విద్యతో పాటు క్రీడాపోటీల్లో రాణిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. విద్యతో పాటు ఆటలను సమానంగా చూడడం వలన జీవితం చాలా సాఫీగా సాగుతుందని ఎమ్మెల్యే అన్నారు
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!