MLA Mekapati Vikram Reddy: అభివృద్ధి చేసుంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారు?
MLA Mekapati Vikram Reddy Fires On Anam Ramanarayana Reddy: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ఆనం కూడా ఓ కారకుడని ఆరోపించారు. అప్పట్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైరయ్యారు. ఆనంకు మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చిందో తనకు తెలుసనన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా, మున్సిపల్, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు.. ఆనం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారని సూటి ప్రశ్న సంధించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరి, ఆత్మకూరుకు ఇంచార్జిగా ఉంటూ.. హడావుడి చేశారని దుయ్యబట్టారు. 2019లో వైసీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లారని విమర్శించారు. యువగళం పాదయాత్రలో అభివృద్ధి జరగలేదని ఆనం విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను లోకేష్ చదివారన్నారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని, నిరూపిస్తూ తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అదే ఆ ఆరోపణల్ని నిరూపించకుంటే, లోకేష్ ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదని ఛాలెంజ్ చేశారు.
Kavya Thapar Hot Photoshoot: కావ్య థాపర్ హాట్ ఫోటోషూట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!
Also Read
- Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
ఇంతకుముందు కూడా.. ‘ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం రా’ అంటూ ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆ పెద్దమనిషి మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో చేసిందేమీ లేదని విమర్శించారు. నాటుసారా తయారుచేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని.. మద్యం గురించి ఆనం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాలంటీర్లకి, గృహ సారధులకి మధ్య తేడా తెలియకుండా మాట్లాడకూడదని సూచించారు. వైసీపీ మేనిఫెస్టోని టీడీపీ కాపీ కొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపాలు అయ్యిందని, మరో శ్రీలంకలా అయిపోయిందంటూ టీడీపీ పేర్కొనడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో