MLA Mekapati Vikram Reddy: అభివృద్ధి చేసుంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Mekapati Vikram Reddy Fires On Anam Ramanarayana Reddy: వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు ఆనం కూడా ఓ కారకుడని ఆరోపించారు. అప్పట్లో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఫైరయ్యారు. ఆనంకు మంత్రి పదవి ఎవరి వల్ల వచ్చిందో తనకు తెలుసనన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యేగా, మున్సిపల్, ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు.. ఆనం ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన అభివృద్ధి చేసి ఉంటే.. 2014 ఎన్నికల్లో ఎందుకు ఓడారని సూటి ప్రశ్న సంధించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరి, ఆత్మకూరుకు ఇంచార్జిగా ఉంటూ.. హడావుడి చేశారని దుయ్యబట్టారు. 2019లో వైసీపీలోకి వచ్చి, ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి వెళ్లారని విమర్శించారు. యువగళం పాదయాత్రలో అభివృద్ధి జరగలేదని ఆనం విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం చేస్తున్నామో ప్రజలకు తెలుసన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను లోకేష్ చదివారన్నారు. దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని, నిరూపిస్తూ తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అదే ఆ ఆరోపణల్ని నిరూపించకుంటే, లోకేష్ ఇంకెప్పుడు ఇటువైపు రాకూడదని ఛాలెంజ్ చేశారు.
Kavya Thapar Hot Photoshoot: కావ్య థాపర్ హాట్ ఫోటోషూట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కిపోవడం పక్కా!
Also Read
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
- Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
- Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
- Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ఇంతకుముందు కూడా.. ‘ఆత్మకూరు అభివృద్ధిపైన డిబేట్ పెట్టుకుందాం రా’ అంటూ ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు ఆత్మకూరు అభివృద్ధి గురించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఆ పెద్దమనిషి మంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరులో చేసిందేమీ లేదని విమర్శించారు. నాటుసారా తయారుచేసే వ్యక్తిని పక్కన పెట్టుకుని.. మద్యం గురించి ఆనం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాలంటీర్లకి, గృహ సారధులకి మధ్య తేడా తెలియకుండా మాట్లాడకూడదని సూచించారు. వైసీపీ మేనిఫెస్టోని టీడీపీ కాపీ కొట్టిందని మండిపడ్డారు. రాష్ట్రం అప్పులపాలు అయ్యిందని, మరో శ్రీలంకలా అయిపోయిందంటూ టీడీపీ పేర్కొనడం శోచనీయమని వ్యాఖ్యానించారు.
Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది
తాజావార్తలు
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..