Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్.. నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చర్చించారు కాంగ్రెస్ నేతలు. సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలని, 15 రోజులకో డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు నేతలు. మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏడాది తరవాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కూడా సైలెంట్ గా జగ్గారెడ్డి ఉండటం గమనార్హం. భువనగిరిలో రైతులకు బేడీలు వేస్తే పట్టుంచుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ సమావేశంలో లేవనెత్తారు.
GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
భువనగిరి రైతుల కోసం ఆందోళనలు చేయాలని సూచించారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా.. పాత వాళ్ళను పక్కన పెట్టేలా చేయకండని, అందరిని కలుపుకుని పోయేలా ఉండాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజుల్లో మండల కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారిందని, ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిందన్నారు. అధికారులు ఎవరు అందుబాటులో లేరని, చనిపోయారు అనే సమాచారం చెప్పాలని అనుకున్నా.. అందుబాటులో లేరన్నారు. గ్రామ సచివాలయం మొదలుకుని.. సచివాలయం వరకు అధికారులు అంతా బీఆర్ఎస్ సేవలో ఉందన్నారు.
ఇది సరికాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది దగా పేరుతో.. 22న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్ని సమీకరించి నిరసన ర్యాలీ.. రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం, కేసీఆర్ ఫోటోకి పది తలలు పెట్టి చేస్తామని ఆయన వెల్లడించారు. భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగింపు ఉంటుందని, అక్కడికి జాతీయ నాయకులను పిలుస్తున్నామన్నారు. భారీ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!