Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్.. నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చర్చించారు కాంగ్రెస్ నేతలు. సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలని, 15 రోజులకో డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు నేతలు. మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏడాది తరవాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కూడా సైలెంట్ గా జగ్గారెడ్డి ఉండటం గమనార్హం. భువనగిరిలో రైతులకు బేడీలు వేస్తే పట్టుంచుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ సమావేశంలో లేవనెత్తారు.
GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!
Also Read
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
భువనగిరి రైతుల కోసం ఆందోళనలు చేయాలని సూచించారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా.. పాత వాళ్ళను పక్కన పెట్టేలా చేయకండని, అందరిని కలుపుకుని పోయేలా ఉండాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజుల్లో మండల కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారిందని, ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిందన్నారు. అధికారులు ఎవరు అందుబాటులో లేరని, చనిపోయారు అనే సమాచారం చెప్పాలని అనుకున్నా.. అందుబాటులో లేరన్నారు. గ్రామ సచివాలయం మొదలుకుని.. సచివాలయం వరకు అధికారులు అంతా బీఆర్ఎస్ సేవలో ఉందన్నారు.
ఇది సరికాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది దగా పేరుతో.. 22న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్ని సమీకరించి నిరసన ర్యాలీ.. రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం, కేసీఆర్ ఫోటోకి పది తలలు పెట్టి చేస్తామని ఆయన వెల్లడించారు. భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగింపు ఉంటుందని, అక్కడికి జాతీయ నాయకులను పిలుస్తున్నామన్నారు. భారీ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!