Revanth Reddy : దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వచ్చే ఐదు నెలల్లో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ మహిళా గర్జనలు నిర్వహించాలని చర్చించారు. ఈ నెలాఖరులోపు బీసీ గర్జన.. డిక్లరేషన్.. నెలకు ఒక డిక్లరేషన్ ఇవ్వాలని చర్చించారు కాంగ్రెస్ నేతలు. సాధ్యాసాధ్యాలపై ఆలోచించాలని, 15 రోజులకో డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు నేతలు. మండల కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఏడాది తరవాత పీఏసీ మీటింగ్ కి జగ్గారెడ్డి హాజరయ్యారు. సమావేశంలో కూడా సైలెంట్ గా జగ్గారెడ్డి ఉండటం గమనార్హం. భువనగిరిలో రైతులకు బేడీలు వేస్తే పట్టుంచుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ సమావేశంలో లేవనెత్తారు.
GST Council Meet: జూలై 11న జీఎస్టీ మీటింగ్.. పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం..!
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
- Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
భువనగిరి రైతుల కోసం ఆందోళనలు చేయాలని సూచించారు. పార్టీలో ఎవరిని చేర్చుకున్నా.. పాత వాళ్ళను పక్కన పెట్టేలా చేయకండని, అందరిని కలుపుకుని పోయేలా ఉండాలని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజుల్లో మండల కమిటీల నియామకం పూర్తి చేయాలన్నారు. దశాబ్ది ఉత్సవాలు.. పార్టీ కార్యక్రమం లెక్క మారిందని, ప్రభుత్వ యంత్రాంగం కుప్పకూలిందన్నారు. అధికారులు ఎవరు అందుబాటులో లేరని, చనిపోయారు అనే సమాచారం చెప్పాలని అనుకున్నా.. అందుబాటులో లేరన్నారు. గ్రామ సచివాలయం మొదలుకుని.. సచివాలయం వరకు అధికారులు అంతా బీఆర్ఎస్ సేవలో ఉందన్నారు.
ఇది సరికాదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దశాబ్ది దగా పేరుతో.. 22న నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల్ని సమీకరించి నిరసన ర్యాలీ.. రావణాసురుడి దిష్టి బొమ్మ దహనం, కేసీఆర్ ఫోటోకి పది తలలు పెట్టి చేస్తామని ఆయన వెల్లడించారు. భట్టి పాదయాత్ర ఖమ్మంలో ముగింపు ఉంటుందని, అక్కడికి జాతీయ నాయకులను పిలుస్తున్నామన్నారు. భారీ సభ ఉంటుందని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?