Minister Viswaroop: లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తా
విజయవాడలో రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ కు వినతి పత్రం ఇచ్చింది లారీ యజమానుల సంఘం. రాష్ట్రంలో లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి విశ్వరూప్. లారీ యజమానులిచ్చిన వినతి పత్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. విభజనతో మిగులు బడ్జెట్ తెలంగాణకు వెళ్తే, లోటు బడ్జెట్ ఏపీకి వచ్చింది. కోవిడ్ మహమ్మారితో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి ఒక సారైనా సీఎం వద్ద లారీ యజమానుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తా. సీఎంతో చర్చించి లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. లారీలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తానన్నారు మంత్రి పినిపె విశ్వరూప్.
Also Read
- Hundi Income: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు.. కళ్లు చెదిరే ఆదాయం..
- Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
- Minister Gottipati Ravikumar: విద్యుత్ కోతలకు నో.. నిరంతర సరఫరా ఉండాల్సిందే.. మంత్రి గొట్టిపాటి ఆదేశాలు
లారీ యజమానుల సంఘం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రేటుకు డీజిల్ కొనుగోలు చేయడం వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల వాహన యజమానులు రాష్ట్రంలో డీజిల్ కొనడం లేదు. రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల కొనుగోళ్లు తక్కువై రాష్ట్రానికి నష్టం వస్తోంది. డీజిల్ పై టాక్సులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. ఆర్టీఎ అధికారులు ఇష్టమొచ్చినట్లుగా లారీలపై కేసులు రాస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
లారీలపై గ్రీన్ టాక్స్ ను 200 నుంచి 20 వేలకు పెంచడం సహా అధిక జరిమానాలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పెనాల్టీలు తగ్గించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 17సార్లు లారీ ఒనర్స్ అసోషియేషన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు పరిష్కరించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మూడేళ్లుగా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని లారీ యజమానుల సంఘం అభిప్రాయపడింది.
Hyderabad Rain : హైదరాబాద్లో భారీ వర్షం.. పలు రోడ్లు జలమయం..
తాజావార్తలు
-
Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. ‘ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్’ వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
-
Lavanya : మా రామ్ చరణ్ బావకి థాంక్స్!
-
Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి ‘బంపర్ గిఫ్ట్’.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
-
Getup Srinu: మేం కాపులం వివాదం.. అంతా ప్రమోషనా?
-
NBK111: నయన్ అవుట్.. కాజల్ ఇన్.. అసలు రీజన్ ఇదా?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!