నారా లోకేష్ పై మంత్రి తానేటి వనిత ఫైర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీవీ తో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాడు..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకపోతే పరామర్శ కి వెళ్ళాలి గాని స్పందించిన తరువాత కూడా పరామర్శ దేనికి. ఘటన జరిగిన ఎన్నో నెలలకి పరామర్శ ఏంటి అని ప్రశ్నించారు. దిశా చట్టం తీసుకు రావాలని సీఎం ని ఎవరు అడగలేదు. ఆడ బిడ్డల రక్షణ కోసం సీఎం దిశా చట్టం తీసుకు వచ్చారు. దిశా చట్టం కి కేంద్రo నుండి అనుమతి రాలేదు కాబట్టి దిశా యాప్ ద్వారా ఆడబిడ్డలకు ప్రస్తుతం రక్షణ ఇస్తున్నాం అన్నారు.
ఇక ముఖ్యమంత్రి మీద భయం తో ప్రతిపక్ష నేతలు పరుగులు పెడుతున్నారు. ఆడబిడ్డలకు మీద శ్రద్ద, అభిమానం ,ప్రేమ టీడీపీ నేతలకు లేదు. కేంద్రం వద్ద దిశా చట్టం ఇంప్లిమెంట్ అవకుండా కొర్రీలు వేస్తుంది టీడీపీనే. కొర్రీలు వేసేది వీళ్ళే, అడబిడ్డల మీద ప్రేమ ఉందని డ్రామాలు ఆడేది వీళ్ళే. దిశా చట్టం ఆమోదం పొందితే క్రైం రేట్ తగ్గుతుంది. రాష్ట్రంలో సైకోలు లేకుండా చేయాలి అంటే కేంద్రం నుండి దిశా చట్టం ఆమోదం పొందాల్సిందే అని పేర్కొన్నారు.
Also Read
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు
-
Ragi Sweet Bondalu : రుచికి తోడు ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి బోండాలు.. పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు.!
-
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
-
UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
-
Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..