Minister Subhash : మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ సవాల్పై మంత్రి సుభాష్ రియాక్షన్
- మాజీ మంత్రి వ్యాఖ్యలపై మంత్రి సుభాష్ స్పందన
- 2023 మెమోపై కీలక ప్రశ్నలు లేవనెత్తిన సుభాష్
- గీత ఉపకులాలను నిర్లక్ష్యం చేసినందుకు మాజీ మంత్రిపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Subhash : మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, సవాళ్లపై మంత్రి సుభాష్ ఘాటుగా స్పందించారు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ వేణుగోపాల్ శ్రీనివాస్ తన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు ఇవ్వకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి 2023లో తెచ్చిన మెమోలో శెట్టిబలిజలను ‘గౌడ’గా చూపిస్తూ ‘ఉపకులం’గా వర్గీకరించిన విషయాన్ని మంత్రి సుభాష్ ప్రశ్నించారు. “ఈ మెమో అసలు ఎందుకు తెచ్చారు? అధికారులు ఇచ్చారు, నాకు తెలియదు అని చెప్పడం మీకే సిగ్గుగా ఉండాలి” అని ఆయన విమర్శించారు.
రాష్ట్రాలు విడిపోయాక శెట్టిబలిజలను ఓసీ కేటగిరీకి మార్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, “2014-19 మధ్యలో టిడిపి ప్రభుత్వం శెట్టిబలిజ, గౌడ, శ్రీసేన, యాద సమూహాలకోసం కార్పొరేషన్ పెట్టింది. కానీ గీత ఉపకులాల విషయానికి వస్తే పూర్తిగా విస్మరించారు” అని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి వేణుగోపాల్ శ్రీనివాస్ గీత ఉపకులాల తరపున ఏమీ చేయలేదని మంత్రి సుభాష్ మండిపడ్డారు. “వేషధారణ చేసారు తప్ప గీత ఉపకులాల పరిస్థితి మార్చడానికి ఏ చర్యా తీసుకోలేదు. పట్టించుకోలేదు కూడా” అని అన్నారు.
Also Read
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్ చెయిన్..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
అంతేకాకుండా.. “బిసి కార్పొరేషన్ లోన్ను మీ కాలంలోనే తీసేసారు. ఇప్పుడు మా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం” అని మంత్రి వ్యాఖ్యానించారు. కులాల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేశారని వేణుగోపాల్ చేసిన ఆక్షేపణలపై మంత్రి సుభాష్ తీవ్రంగా ఖండించారు. “కులానికి క్షమాపణ చెప్పాల్సింది నేను కాదు, మీరు. కోటు, కర్ర పెట్టుకుని చేసే మీ డ్రామాలకు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు” అని ఆయన స్పష్టం చేశారు. “మీరు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు నిధులు ఇవ్వలేదు. ఖాళీ పేర్లుగా మాత్రమే ఉంచారు” అని మంత్రి సుభాష్ విమర్శించారు.
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి వాయిదా.. ఎందుకో తెలుసా!
తాజావార్తలు
-
Students Protest : ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై సల్మాన్ ఖాన్ ట్వీట్ వైరల్
-
CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
-
Dharmendra Pradhan: కేంద్ర విద్యాశాఖ మంత్రిని తప్పించకపోవడానికి 5 బలమైన కారణాలివే..
-
Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
-
Vaibhav Suryavanshi: హరారేలో వైభవ్ ట్రాక్ రికార్డు ఇదే.. జింబాబ్వేకు కూడా దబిడిదిబిడే!
ట్రెండింగ్
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి