Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్ అయ్యారు… ఇక, డిసెంబర్లో రాజధాని అని ప్రకటన వస్తే నవంబర్లో పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు.. పయ్యావుల కేశవ్ సహా టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు అమరావతి ప్రాంతంలో ఎలా కొనుగోలు చేశారు? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Minister Botsa Satyanarayana: సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ..!
Also Read
ఇక, ల్యాండ్ పూలింగ్ పేరుతో రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల లబ్ది తన బినామీలకు దక్కేటట్లు చంద్రబాబు చేశారు అని ఆరోపించారు మంత్రి అప్పలరాజు.. 29 గ్రామాల్లోని తన బినామీల చేతిలో పది వేల ఎకరాలు అభివృద్ధి చేసిన భూమి పెట్టే విధంగా చట్టం చేశారని విమర్శించిన ఆయన.. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండకుండా చట్టంలో నిబంధనలు పెట్టిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. అమరావతిని కమ్మ రాజధాని చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు. కాగా, అమరావతి రైతులు రెండో దఫా పాదయాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే.. వెంకటపాలెంలో ప్రారంభమైన ఈ యాత్ర వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి సన్నిధికి చేరుతుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!