Minister Seediri Appalaraju: పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుంటాం.. మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి రైతుల పాదయాత్రపై సంచలన కామెంట్లు చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు… అమరావతి ప్రాంత భూముల స్కాం ఆరోపణల్లో కొత్త వాదన తెర మీదకు తీసుకుని వచ్చిన ఆయన.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర కచ్చితంగా అడ్డుకుని తీరుతాం అన్నారు.. ఈ విషయంలో చర్చే అవసరం లేదన్న ఆయన.. శ్రీకాకుళం పోరాటాల గడ్డ.. మా ప్రాంతానికి వచ్చి మా గుండెలపై కొడతాం అంటే ఊరుకుంటామా? అంటూ ఫైర్ అయ్యారు… ఇక, డిసెంబర్లో రాజధాని అని ప్రకటన వస్తే నవంబర్లో పయ్యావుల కేశవ్ రాజధాని ప్రాంతంలో భూమి కొనుగోలు చేసింది వాస్తవం కాదా? అని నిలదీశారు.. పయ్యావుల కేశవ్ సహా టీడీపీ నాయకులు నాలుగు వేల ఎకరాలకు పైగా భూములు అమరావతి ప్రాంతంలో ఎలా కొనుగోలు చేశారు? అంటూ ఫైర్ అయ్యారు.
Read Also: Minister Botsa Satyanarayana: సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ..!
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
ఇక, ల్యాండ్ పూలింగ్ పేరుతో రెండు, మూడు లక్షల కోట్ల రూపాయల లబ్ది తన బినామీలకు దక్కేటట్లు చంద్రబాబు చేశారు అని ఆరోపించారు మంత్రి అప్పలరాజు.. 29 గ్రామాల్లోని తన బినామీల చేతిలో పది వేల ఎకరాలు అభివృద్ధి చేసిన భూమి పెట్టే విధంగా చట్టం చేశారని విమర్శించిన ఆయన.. రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండకుండా చట్టంలో నిబంధనలు పెట్టిన చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.. అమరావతిని కమ్మ రాజధాని చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం.. చంద్రబాబు లాంటి మేధావి ప్రపంచంలోనే ఉండడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు. కాగా, అమరావతి రైతులు రెండో దఫా పాదయాత్ర ప్రారంభం అయిన విషయం తెలిసిందే.. వెంకటపాలెంలో ప్రారంభమైన ఈ యాత్ర వెయ్యి కిలోమీటర్లు సాగి.. నవంబరు 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని సూర్యభగవానుడి సన్నిధికి చేరుతుందని ప్రకటించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!