Maoist Letter: ఏపీ మంత్రికి మరోసారి మావోయిస్టుల వార్నింగ్.. నాకు సంబంధం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు.. పద్దతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.. పార్టీ పంపిన లేఖపై చర్యలుంటాయనడం అప్పలరాజుకి తగదని.. మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని ఆంధ్ర ఒడిశా బోర్డర్ (ఏవోబీ) కమిటీ వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరుతో లేఖ విడుదలైంది.. ఇక, ఈ లేఖ సోషల్ మీడియాలో ఎక్కి వైరల్గా మారిపోయింది.. అయితే, గతంలో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గణేష్ పేరిట లేఖ విడుదల కాగా.. ఇప్పుడు వైవీఎస్ కార్యదర్శి అశోక్ పేరిట లేఖ వచ్చింది. పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి మావోయిస్టులు.. పేదల భూములను కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలంటూ ఆయనను వార్నింగ్ ఇచ్చారు.. మావోయిస్టులపై తప్పుడు ప్రచారం మంచిది కాదని లేఖలో హితవుపలికారు..
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
అయితే, మావోయిస్టుల లేఖపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు.. మావోయిస్టుల నుంచి నాకు లేఖ రావడం ఆశ్చర్యం కలిగించే విషయం అన్నారు.. మావోయిస్టుల లేఖలోని అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఈ లేఖ నిజమా? లేదా? అనే విషయాన్ని తేల్చాల్సింది పోలీసులే అన్నారు. లేఖలో ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే.. రామకృష్ణాపురం భూములకు సంబంధించి.. సూదికొండలోని గ్రావెల్ క్వారి గురించి అసలు నాకేంటి? సంబంధం అని ప్రశ్నించారు. సూదికొండ అనేది పాలస నడిబొడ్డున ఉండే కొండ.. గతంలోనే గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకొచ్చి.. పార్టీకి చెందిన నేతే క్వారీ ప్రారంభించారు.. కానీ, అది మంచిది కాదని, ప్రజల నుంచి వ్యతిరేక వస్తుందని.. నేనే క్వారింగ్ ఆపించి.. కౌన్సిల్లో తీర్మానం చేయించామన్నారు.. అయితే, సూది కొండ క్వారింగ్ ఆపినందుకు తమ పార్టీలోని నేతే.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఒక అసమ్మతి నేత నాపై దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి అప్పలరాజు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి…
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!